TE/Prabhupada 0833 - మీరు కృష్ణుడు, వైష్ణవుడు, గురువు మరియు అగ్ని ఎదుట సేవ చేయటానికి ఈ ప్రతిజ్ఞ చేయండి

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Sannyasa Initiation -- Bombay, November 18, 1975


మన సన్యాసులు, వారు చాలా కష్టపడి పని చేస్తారు, ప్రచారము చేస్తారు, డబ్బు సంపాదిస్తారు - కానీ ఒక్క పైసా కూడా తమ కొరకు ఉంచుకోరు. మొట్టమొదటగా, బ్రహ్మచారికి శిక్షణ ఇవ్వాలి. Brahmacārī guru-kule vasan dānto guror hitam ( SB 7.12.1) గురువు యొక్క ప్రయోజనము కోసం, గురువు గారి ఆశ్రమములో ఉండేందుకు బ్రహ్మచారికి శిక్షణ ఇవ్వాలి. ఇదే సిద్ధాంతం, అది ఫలవంతము అయితే ఒకరు కృష్ణుడి ప్రయోజనము కోసం తన జీవితాన్ని అంకితం చేసినప్పుడు...

కృష్ణుడి ప్రయోజనము అంటే మొత్తం ప్రపంచానికి ప్రయోజనము. కృష్ణుడు కోరుకున్నది sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఒక సన్యాసి ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళాలి. Mahad-vicalanaṁ nṛṇāṁ gṛhiṇāṁ dīna-cetasām ( SB 10.8.4) ఒక సన్యాసిని మాహాత్మ అని పిలుస్తారు. ఎందుకు ఆయన మహాత్మా? ఎందుకంటే ఆయన ఆత్మ ఇప్పుడు విస్తృతమైంది. Gṛhiṇāṁ dīna-cetasām. Mahad-vicalanam. మహాత్మా దేశంలో ప్రయాణిస్తాడు లేదా తిరుగుతాడు, ప్రతి ఇంటికి - mahad-vicalanaṁ nṛṇāṁ gṛhiṇām - ముఖ్యంగా గృహస్థులకు, దీన-చేతసామ్, ఎవరి చైతన్యము లేదా మనస్సు చాలా వికలాంగమైనదో. వారిని దీన-చేతసామ్. ఈ భౌతిక వ్యక్తులు అందరు, వారు ఇంద్రియాలను ఎలా అనుభవించాలని అనుకుంటున్నారు? అందువల్ల వారిని దీన-చేతసామ్ అని పిలుస్తారు. వారికి ఏ ఇతర ఆలోచన లేదు. అందువల్ల సన్యాసి యొక్క కర్తవ్యము ప్రతి ఇంటికి వెళ్ళి, వారికి జ్ఞానాన్ని ఇవ్వడము ప్రతీ దేశమునకు, కేవలం జీవితం యొక్క లక్ష్యం గురించి భోదించడానికి. ఇది ఇప్పటికీ భారతదేశంలో జరుగుతోంది. ఇప్పటికీ, సన్యాసి ఒక గ్రామంలోకి వెళితే, ప్రజలు అతన్ని ఆహ్వానిస్తారు, ఆయన నుండి శ్రవణము చేయడానికి ప్రయత్నిస్తారు.

కావున మీరు కృష్ణుడు, వైష్ణవుడు, గురువు మరియు అగ్ని ఎదుట సేవ చేయటానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ బాధ్యతను మర్చిపోకుండా ఉండటానికి చాలా జాగ్రత్త వహించాలి. మీకు మంచి అవకాశం వచ్చింది. మీరు ఈ వ్యక్తులను ముక్తులను చేయడానికి ఆఫ్రికాకు వెళ్తున్నారు. శుకదేవ గోస్వామి అన్నాడు, kirāta-hūṇāndhra-pulinda-pulkaśā ābhīra-śumbhā yavanāḥ khasādayaḥ, ye 'nye ca pāpā ( SB 2.4.18) ఈ వ్యక్తుల సమూహము చాలా పతితులైన వారిగా భావిస్తారు, కిరాట, నల్లని వారు వారిని నిశధా అని పిలుస్తారు. నిశధా, రాజూ వెనాకు జన్మించాడు. కాబట్టి వారు దొంగిలించడానికి అలవాటు పడ్డారు; అందుచే వారికి ఒక ప్రత్యేక ప్రదేశం, ఆఫ్రికన్ అరణ్యాలు ఇవ్వబడ్డాయి. అది భాగవతం లో ఉంది.... కానీ ప్రతి ఒక్కరినీ పవిత్రము, ముక్తులను చేయవచ్చు. Kirāta-hūṇāndhra-pulinda-pulkaśā ābhīra-śumbhā yavanāḥ khasādayaḥ ye 'nye ca pāpā. వీరిని పాపములు చేసే జీవులు అని పిలుస్తారు. కానీ శుకదేవ గోస్వామి చెప్తారు, "ఇక్కడ పేర్కొనబడని ఇతరులు ఉండవచ్చు." Ye 'nye ca pāpā yad-apāśrayāśrayāḥ: వారు వైష్ణవుని యొక్క ఆశ్రయం తీసుకుంటే, శుద్ధ్యంతి, "వారు పవిత్రము అవుతారు."

కాబట్టి మీరు చాలా ధృడమైన వైష్ణవుడు కావాలి; అప్పుడు మీరు వారిని పవిత్రము, ముక్తులను చేయగలరు. శుద్ధ్యంతి. మరో జన్మ తీసుకోకుండానే వారు ఎలా పవిత్రము అవుతారు? అవును. ప్రభ విష్ణవే నమః. ఎందుకంటే వైష్ణవుడు వారిని పవిత్రము, ముక్తులను చేయబోతున్నాడు, విష్ణువు యొక్క శక్తి ద్వారా వారు శక్తీవంతులు అవుతారు కాబట్టి నైరోబీకి వెళ్ళినప్పుడు ఆచరణాత్మకంగా మనము ఇంతకు ముందు చూశాము, చాలామంది, ఈ ఆఫ్రికన్లు, వారు బాగా అభివృద్ధి చెందుతున్నారు. వారు మంచి ప్రశ్నలు వేస్తున్నారు. వారు నియమాలు నిబంధనలను అనుసరిస్తున్నారు. కాబట్టి ఆఫ్రికన్ ప్రజలు, వారు చాలా అధునాతనమైన లేదా నాగరికము అని పిలువబడే వారు కాదు, భగవంతుని మర్చిపోవడానికి. కానీ మీరు నిజాయితీగా పని చేస్తే మీ ప్రయత్నం ద్వారా ఒక వ్యక్తిని పవిత్రము, ముక్తుడుని చేయగలిగితే, అప్పుడు వెంటనే మీరు కృష్ణుడి చేత గుర్తించబడతారు. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ ( BG 18.69) ప్రచారము చేయడము ద్వారా కృష్ణుడిచే గుర్తించబడటానికి ఇది వేగవంతమైన మార్గం