TE/Prabhupada 0943 - నాకు ఏదీ చెందదు. Isavasyam idam sarvam,అంతా కృష్ణునికి చెందుతుంది

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730427 - Lecture SB 01.08.35 - Los Angeles


నాకు ఏదీ చెందదు. Isavasyam idam sarvam, అంతా కృష్ణునికి చెందుతుంది కావున ప్రతిఒక్కరూ, ఎందుకంటే వారి అపరిమిత కోరికల వలన, ఒకటి తరువాత మరొకటి... ఈ కోరిక, ఈ కోరిక నెరవేరినప్పుడు, మరొక కోరిక, మరొక కోరిక, మరొక కోరిక. ఈ విధముగా మీరు కేవలం సమస్యలను సృష్టిస్తున్నారు. కోరికలు నెరవేర్చబడనప్పుడు, అప్పుడు మనము నిరాశకు గురవుతున్నాము, అయోమయం చెందుతాము. నిరాశ ఉంటుంది ఒక రకమైన నిరాశ ఉదాహరణకు మీ దేశంలో హిప్పీల లాగానే, అది కూడా నిరాశ. మన దేశంలో నిరాశ ఉదాహరణకు మీ దేశములో వలె ఇది చాలా పాత నిరాశ, సన్యాసి అవ్వటము కాబట్టి సన్యాసి అవ్వటము, బ్రహ్మ సత్యం జగమ్ మిథ్య, ఈ ప్రపంచం అబద్ధం. ఇది ఎలా? తప్పు ఆయన దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు; కాబట్టి ఇది తప్పు. ఇది తప్పు కాదు. వైష్ణవ సిద్ధాంతము ఏమిటంటే ఈ ప్రపంచము మిథ్య కాదు, ఇది సత్యము. కానీ మీరు "నేను ఈ లోకమునకు ఆనందిస్తాను" అని అనుకునేటప్పుడు ఇది తప్పు. అది తప్పు. మనము దానిని అంగీకరించినట్లయితే, అది కృష్ణుడిది అని, మీరు కృష్ణుడి సేవ కోసం ఉపయోగించ బడాలి, అప్పుడు అది తప్పు కాదు. ఈ పువ్వులు, ఈ పువ్వులు అవి ఫ్లోరిస్ట్ షాపులో ఉన్నాయి, ఈ ఉదాహరణను మనము చెప్పాము. ప్రజలు కొనుగోలు చేయడానికి చాలా పువ్వులు ఉన్నాయి. మనము కొనుగోలు చేస్తున్నాము, ఇతరులు కొనుగోలు చేస్తున్నారు. వారు ఇంద్రియ తృప్తి కోసం కొనుగోలు చేస్తున్నారు, మనము కృష్ణుడి కోసం కొనుగోలు చేస్తున్నాము. పుష్పం అదే. కావున మీరు "మీరు కృష్ణుడికి అర్పిస్తున్నారు. కృష్ణుడు మహోన్నతమైన ఆత్మ, భౌతిక పదార్థాలను, ఈ పువ్వులని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? " కానీ వాస్తవానికి భౌతికము అనేది ఏదీ లేదని వారికి తెలియదు. మీరు కృష్ణుడిని మర్చిపోయినప్పుడు, అది భౌతికము. అది భౌతికము. ఈ పుష్పం కృష్ణుని కోసము ఉద్దేశించబడింది. ఇది ఆధ్యాత్మికం. మనము ఈ పువ్వు తీసుకున్నప్పుడు, నా ఇంద్రియ ఆనందము కొరకు, ఇది భౌతికము. ఇది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం . ఏమీ నాకు చెందదు. Īśāvāsyam idaṁ sarvam, ప్రతిదీ కృష్ణునికి చెందుతుంది. అందువలన మన ఉద్యమం ఈ కృష్ణ చైతన్యమును మేల్కొల్పడానికి. ప్రతిదీ కృష్ణుడికి చెందుతుంది అని మనము తెలుసుకోవాలి. కృష్ణుడు వాస్తవం. ప్రపంచం వాస్తవం. ఈ ప్రపంచము కృష్ణునిచే సృష్టించబడింది, అందుచే ఇది కూడా సత్యము. అందువల్ల ప్రతిదీ వాస్తవము అది కృష్ణ చైతన్యంలో జరిగినప్పుడు లేకపోతే అది మాయ, అవిద్య.

కావున అవిద్య ద్వారా, అజ్ఞానంతో, మనం ఇంద్రియ తృప్తిని కోరుకుంటున్నాము, మనము సమస్యలను సృష్టిస్తాము. మనము చాలా కృత్రిమమైన పనిని సృష్టించాము, ugra-karma. మనము అవిద్యలో ఉన్నప్పటికీ, కృష్ణుడి యొక్క కృప వలన ప్రతిదీ చాలా సరళము చేయబడినది. ఉదాహరణకు ఎక్కడైనా , ప్రపంచంలోని ఏ భాగములో అయినా, ఆహారము ఉంది. అంతా అక్కడ ఉంది, పూర్ణము, pūrṇam idam, pūrṇam idam. ఉదాహరణకు కొంత మంది గ్రీన్లాండ్, అలస్కా లో జీవిస్తున్నారు, ఆ వాతావరణం మన పరిశీలన ప్రకారము చాలా అనుకూలమైనది కాదు, కానీ వారు నివసిస్తున్నారు, అక్కడ నివాసము ఉంటున్నారు. కొంత ఏర్పాటు ఉంది. అదేవిధముగా , మీరు ప్రతిచోటా సూక్ష్మంగా అధ్యయనం చేస్తే... నీటిలో లక్షలాది మిలియన్ల చేపలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక పడవలో ఉంచి, ఉదాహరణకు మీరు ఒక నెల రోజులు ఉండాలి అని అనుకుందాము, అప్పుడు మీరు చనిపోతారు. మీకు ఆహారం ఉండదు. కానీ అప్పుడు... నీటి లోపల, మిలియన్ల కొద్దీ చేపలు, లక్షలాది చేపలు ఉన్నాయి, వాటికి తగినంత ఆహారం ఉంది. తగినంత ఆహారం. ఆహారం కోసం ఒక్క చేప కూడా చనిపోదు. కానీ మిమ్మల్ని నీటిలో పెట్టినట్లయితే, మీరు చనిపోతారు. అదేవిధముగా , భగవంతుని యొక్క సృష్టిలో 84,00,000 జాతులు, జీవులు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అందరికి ఆహారాన్ని ఇచ్చాడు. ఉదాహరణకు మీరు జైలులో ఉన్నట్లయితే, మీ ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధముగా, ఈ భౌతిక ప్రపంచం జైలుగా పరిగణించబడుతున్నప్పటికీ జీవికి, అయినప్పటికీ దేనికి కొరత లేదు