TE/Prabhupada 0232 - భగవంతుడి మీద కుడా అసూయ కలిగిన శత్రువులు ఉన్నారు. వారిని రాక్షసులు అని పిలుస్తారు



Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

ప్రద్యుమ్న: "గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటే ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది" వారు ప్రాపంచిక లాభమును కోరుకొనుచున్నప్పటికీ, వారు ప్రామాణికులే. వారు చంపబడితే, మనము అనుభవించు సమస్తము రక్తంతో కళంకము అవ్వును. "

ప్రభుపాద: అందువల్ల అర్జునుడికి, కుటుంబ సభ్యులను చంపడము ఎలా అనేది మొదటి సమస్య. ఇప్పుడు, కృష్ణుడు అతనిని ఒక స్నేహితుడిగా మందలిస్తున్నాడు "నీవు ఎందుకు బలహీనంగా ఉన్నావు? బలహీనంగా ఉండకండి. ఇది హృదయ ధౌర్భల్యం (మూఢనమ్మకము). ఈ విధమైన కరుణ మూర్ఖత్వం (మూఢనమ్మకము) Uttiṣṭha. నీవు లేచి నిలబడి పోరాటము చెయ్యి. " కానీ, ఆయన చెయ్యవచ్చు... నేను ఏదైనా చేయకూడదు అనుకుంటే, నేను చాలా సూచనలను (అభ్యర్ధనలను) ఇస్తాను. మీరు చూడండి? తరువాత అతను గురువును గురించి అడుగుతున్నాడు: సరే, కృష్ణ, మీరు నా బంధువుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నా బలహీనత అని అంగీకరిస్తున్నాను. కృష్ణుడిని "మధుసూదన" అని పిలుస్తారు. మధుసూదన అంటే... కానీ నా గురువుని చంపమని నీవు నాకు ఎలా సలహా ఇస్తావు? ద్రోణాచార్యుడు నా గురువు. భీష్మదేవుడు కూడా నా గురువు. నా గురువును చంపాలని మీరు కోరుకుంటున్నారా? Gurūn hi hatvā. ఆయన సాధారణ గురువు మాత్రమే కాదు. వారు సాధారణ వ్యక్తులు కాదు. Mahānubhāvān. భీష్ముడు ఒక గొప్ప భక్తుడు, అదేవిధంగా, ద్రోణాచార్య కూడా గొప్ప వ్యక్తి. Mahānubhāvān. కావున kathaṁ bhīṣmam ahaṁ saṅkhye droṇaṁ ca madhusūdana ( BG 2.4) వారు ఇద్దరు గొప్ప వ్యక్తులు, వారు నాకు గురువులు మాత్రమే కాదు, వారు గొప్ప వ్యక్తులు." మధువు కృష్ణుడి శత్రువు, రాక్షసుడు. అందువలన అతడు చంపబడ్డాడు. మీరు మధుసూదన , మీరు మీ శత్రువులను హతమార్చారు. మీరు మీ గురువును చంపారని మీరు నాకు రుజువు ఇవ్వగలరా? ఎందుకు నన్ను అడుగుతున్నారు? ఇది ఉద్దేశ్యం. Iṣubhiḥ pratiyotsyāmi pūjārhāv ari-sūdana. Again Ari-sūdana అరి అంటే శత్రువు. మధుసూదన, ముఖ్యంగా "మధువు అను రాక్షసుడిని చంపిన వాడు." తరువాత అరిసూదన . అరి అంటే శత్రువు. కృష్ణుడు చాలామంది రాక్షసులను చంపాడు, అరి, అతను శత్రువుగా ఆయనతో పోరాడటానికి వచ్చినాడు. అందువలన అతని నామము అరిసూదన.

కృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు, మన గురించి ఏమి మాట్లాడాలి? ఈ భౌతిక ప్రపంచం అలా చేయబడుతుంది, మీరు కొందరు శత్రువులను కలిగి ఉంటారు. Matsaratā. మత్సరతా అంటే అసూయ, ఈ భౌతిక ప్రపంచం ఇలా ఉంటుంది. భగవంతుడి మీద కుడా అసూయ కలిగిన శత్రువులు ఉన్నారు. వారిని రాక్షసులు అని పిలుస్తారు. సాధారణ అసూయ లేదా శత్రువు, అది సహజమైనది. కానీ భగవంతుడు మీద కూడా. నిన్న సాయంత్రం రాత్రి, నన్ను చూడటానికి ఎవరో వచ్చారు. ఎందుకు కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించాలి? అని వాదిస్తున్నాడు. ఇది అతని వాదన. కావున కృష్ణుడికి శత్రువులు ఉన్నారు. అందువలన కృష్ణుడు... అతనికి మాత్రమే కాదు, భౌతిక ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరూ కృష్ణుడి యొక్క శత్రువు. ప్రతి ఒక్కరూ. ఎందుకంటే వారు కృష్ణుడి పోటీదారుడిగా ఉండాలని కోరుకుంటారు. కృష్ణుడు ఇలా చెప్పాడు, భోక్తారాం, "నేను మహోన్నతమైన భోక్తను." Sarva-loka-maheśvaram: ( BG 5.29) "నేను మహోన్నతమైన యజమానిని." వేదాలు కూడా ధృవీకరించాయి, īśāvāsyam idaṁ sarvam ( ISO 1) అంతా దేవాదిదేవుడు యొక్క ఆస్తి. Sarvaṁ khalv idaṁ brahma. ఇవి వేదముల ఉపదేశములు. Yato vā imāni bhūtāni jāyante:: "వారి నుండి ప్రతిదీ వచ్చింది." Janmādy asya yataḥ ( SB 1.1.1) ఈ విధముగా వేదములలో చెప్పబడినది. అయితే, మనము శత్రువులు అయినందున, "లేదు, కృష్ణుడు ఎందుకు యజమానిగా ఉండాలి? నేను యజమానిని ఎందుకు కృష్ణుడు మాత్రమే భగవంతుడుగా ఉండాలి. నాకు మరొక భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మరొక భగవంతుడు ఉన్నాడు.