TE/Prabhupada 0427 - ఆత్మ, స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం నుండి భిన్నంగా ఉన్నది



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972


వేదముల పద్ధతి ప్రకారం, సమాజంలో నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) మానవ సమాజాన్ని నాలుగు తరగతుల వ్యక్తులుగా విభజించాలి. ఉదాహరణకు మన శరీరంలో వలె నాలుగు వేర్వేరు విభాగాలు ఉన్నాయి: బుద్ధి విభాగం, చేయి విభాగం, కడుపు విభాగం, మరియు కాలు విభాగం. మీకు ఇవి అన్నీ అవసరము. శరీరమును నిర్వహించవలసి ఉంటే, అప్పుడు మీరు మీ తల, మీ చేతులు, మీ కడుపు, కాలు సరిగా నిర్వహించాలి. సహకారం అవసరము. భారతదేశ కుల పద్ధతి గురించి చాలా సార్లు మీరు విన్నారు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇది కృత్రిమము కాదు. ఇది సహజమైనది. మీరు ఏ సమాజమునకు వెళ్ళినా, భారతదేశంలోనే కాదు, ఏ ఇతర దేశంలో అయినా, ఈ నాలుగు తరగతుల వ్యక్తులు ఉన్నారు. ఇంటెలిజెంట్ తరగతి వ్యక్తులు, అడ్మినిస్ట్రేటర్ తరగతి వ్యక్తులు, ఉత్పాదక తరగతి వ్యక్తుల, మరియు కార్మికుల తరగతి వ్యక్తులు. మీరు దానిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు, కానీ అలాంటి విభజన ఉండాలి. నేను చెప్పినట్లుగా, నా శరీరంలో విభాగాలు ఉన్నాయి - మనస్సు బుద్ధి విభాగము, చేతుల విభాగము, కడుపు విభాగము, మరియు కాలు విభాగం. కాబట్టి రాజులు అందరూ, వారు ప్రజల రక్షణ కోసం చేతుల విభాగానికి చెందినవారు. గతంలో, క్షత్రియులు... క్షత్రియుడు అంటే శత్రువుల వలన హాని కలగకుండా పౌరులకు రక్షణ కల్పించే వ్యక్తి అతనిని క్షత్రియుడు అని పిలుస్తారు.

కాబట్టి మనము చెప్తున్నాము అర్జునుడికి కృష్ణుడు తెలియజేసినాడు ఎందుకు నీవు నీ కర్తవ్యము నుండి వైదొలగిపోతున్నావు? నీవు అనుకుంటున్నావా, నీ సోదరుడు లేదా నీ మామ లేదా నీ తాత ఇతర వైపున ఉన్న, వారు పోరాటము తరువాత చనిపోతారు? లేదు. వాస్తవం కాదు." కృష్ణుడు అర్జునుడికి ఈ శరీరము వ్యక్తికి భిన్నము అని భోధన చేయాలని అనుకుంటున్నాడు ఉదాహరణకు మనము ప్రతి ఒక్కరము, మనము చొక్కా మరియు కోటు నుండి భిన్నంగా ఉన్నాము. అదేవిధముగా, మనము జీవులము, ఆత్మ, స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం నుండి భిన్నంగా ఉన్నాము. ఇది భగవద్గీత యొక్క తత్వము. ప్రజలు దానిని అర్థం చేసుకోలేరు. సాధారణంగా, ఆయన ఈ శరీరం అని అర్థం చేసుకుంటారు. ఇది శాస్త్రములలో ఖండించబడింది.

yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
(SB 10.84.13)

గో అంటే ఆవు అని అర్థం, మరియు ఖర అంటే గాడిద. శారీరక భావనలో జీవిస్తున్న వారు ఎవరైనా yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke... శరీర భావన జంతువులు కోసం ఉద్దేశించబడింది. కుక్క తాను ఈ శరీరం కాదు, ఆయన పవిత్రమైన ఆత్మ అని దానికి తెలియదు. కానీ ఒక వ్యక్తి, ఆయన చదువుకున్నట్లయితే, ఆయన అర్థం చేసుకోగలడు ఆయన ఈ శరీరం కాదు, ఆయన ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నాడు. మన శరీరం నుండి భిన్నంగా ఉన్నామని ఆయన ఎలా తెలుసుకోగలడు? అది కూడా చాలా సరళీకృత పద్ధతి. ఇక్కడ, మీరు భగవద్గీతలో కనుగొంటారు, ఇది చెప్పబడింది,

dehino 'smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
(BG 2.13)

Dehinaḥ... Asmin dehe, ఈ శరీరంలో, ఆత్మ ఉన్నందున, దేహి... దేహ అంటే ఈ శరీరమును కలిగిన వాడు. నేను ఈ శరీరం కాదు. మీరు నన్ను అడిగితే, "ఏమిటి..." కొన్నిసార్లు మనము పిల్లవాడిని ఇలా ప్రశ్నిస్తాము, "ఇది ఏమిటి?" ఆయన చెప్పుతాడు "ఇది నా తల." అదేవిధముగా, మీరు నన్ను కూడా అడిగితే ఎవరైనా, "ఇది ఏమిటి?" ఎవరైనా చెప్తారు, "ఇది నా తల." ఎవరూ చెప్పరు, "నేను తలని." మీరు శరీరంలోని అన్ని భాగాలను జాగ్రతగా పరిశీలిస్తే, మీరు ఇలా చెబుతారు, ఇది నా తల, నా చేయి, నా వేలు, నా కాలు, కానీ "నేను" ఎక్కడ ఉన్నాను? నా యొక్క అనేది చెప్పబడుతుంది నేను ఉన్నప్పుడు. కానీ మనకు "నేను" అనే దానికి సమాచారము లేదు మనము కేవలం "నా యొక్క" అనే సమాచారాన్ని కలిగి ఉన్నాము. దీనిని అజ్ఞానం అంటారు. ప్రపంచం మొత్తం శరీరమును తానుగా తీసుకునే ఈ అవగాహనలో ఉంది ఇంకొక ఉదాహరణ మేము మీకు ఇస్తాము. ఉదాహరణకు మీ బంధువులు, ఉదాహరణకు నా తండ్రి చనిపోయారని అనుకుందాం. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, "నా తండ్రి వెళ్లిపోయారు, నా తండ్రి చనిపోయారు" కానీ ఎవరైనా చెప్పినట్లయితే, "మీ తండ్రి చనిపోయారు అని ఎందుకు అంటారు? ఆయన ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఎందుకు నీవు ఏడుస్తున్నావు? " లేదు, లేదు, లేదు, అది ఆయన శరీరం. అది ఆయన శరీరం. నా తండ్రి చనిపోయినాడు. అందువలన మన ప్రస్తుత లెక్కలో నేను మీ శరీరం చూస్తున్నాను, మీరు నా శరీరాన్ని చూస్తున్నారు, కానీ ఎవరూ అసలైన వ్యక్తిని చూడడము లేదు. మరణం తరువాత, ఆయన ఆలోచిస్తాడు", ఇది నా తండ్రి కాదు, ఇది నా తండ్రి శరీరం." మీరు చూడండి? కాబట్టి మనం మరణం తరువాత బుద్ధిమంతులము అవుతాము మనం నివసిస్తున్నప్పుడు, మనము అజ్ఞానంలో ఉన్నాము. ఇది ఆధునిక నాగరికత. జీవిస్తున్న సమయంలో... ఉదాహరణకు ప్రజలు కొంత డబ్బు సంపాదించడానికి భీమా పాలసీని కలిగి ఉంటారు. కాబట్టి ఆ డబ్బు మరణం తర్వాత పొందబడింది, జీవించి ఉన్నప్పుడు కాదు. కొన్నిసార్లు జీవించి ఉన్నప్పుడు కూడా. కాబట్టి మనం జీవిస్తున్నంత కాలము, మనము అజ్ఞానంలో ఉన్నాం. మనకు తెలియదు "నా తండ్రి ఏమిటి, నా సోదరుడు ఏమిటి, నేనంటే ఏమిటి." కానీ ప్రతి ఒక్కరూ ఈ అభిప్రాయంలో ఉన్నారు, "ఈ శరీరము నా తండ్రి, ఈ శరీరం నా పిల్లవాడు, ఈ శరీరం నా భార్య." దీనిని అజ్ఞానం అని పిలుస్తారు. మీరు మొత్తం ప్రపంచాన్ని అధ్యయనం చేసినట్లయితే, జీవించి ఉన్న సమయములో ప్రతి ఒక్కరూ దీనిని చెబుతారు నేను ఇంగ్లీష్ వాడిని, "నేను భారతీయుడిని", "నేను హిందువుని," "నేను ముస్లిమ్ ని." కానీ మీరు ఆయనని అడిగితే, "వాస్తవానికి మీరు వారా?" ఎందుకంటే ఈ శరీరము హిందూ, ముస్లిం, లేదా క్రిస్టియన్ ఎందుకంటే ఈ శరీరము ప్రమాదం వలన ఉత్పత్తి చేయబడింది, హిందూ, ముస్లిం సమాజంలో లేదా శరీరము ఒక ప్రత్యేక దేశంలో జన్మించినందున, అందువల్ల నేను "నేను భారతీయుడను," ఐరోపావాడను, "ఇది నేను, "అది నేను. " కానీ శరీరం చనిపోయినప్పుడు, ఆ సమయంలో మనం చెప్తాము, లేదు, లేదు, శరీరం లోపల ఉన్న వ్యక్తి, అతను వెళ్ళి పోయినాడు. ఇది వేరే విషయము