TE/Prabhupada 0002 - పిచ్చి మనిషి నాగరికత

Revision as of 14:09, 26 March 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telegu Pages with Videos Category:Prabhupada 0002 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 6.1.49 -- New Orleans Farm, August 1, 1975

హరికేస:అనువాదం..."నిద్రలో ఉన్న ఒక వ్యక్తి తన కలలో ప్రకారం అతని శరీరం చర్యలను వ్యక్తం చేస్తుంది, లేదా శరీరమే తాను అని అంగీకరిస్తాడు. అదేవిధంగా, అతను ప్రస్తుత శరీరమే తాను అని గుర్తిస్తాడు, ఇది తన గత ఆచారమైన లేదా అనాచారమైన జీవితం వలన సంపాదించుకున్నది, మరియు అతను తన గత లేదా భవిష్యత్తు జీవితాన్ని గురుంచి తెలుసుకోలేడు. ప్రభుపాద [SB 6.1.49]: యథాజ్ఞాస్ తామస (యుక్త) ఉపాసతే వ్యక్తం ఎవ హి న వేద పూర్వం అపారం నస్త-జన్మ-స్మ్ర్తిస్ తథ. ఇది మన స్థానం. ఇది మన శాస్త్రం యొక్క పురోగతి. అది ఏమిటంటే "నేను ఈ జీవితం ముందు ఏమిటి మరియు నేను ఈ జీవితం తర్వాత ఏమి అవుతాను?" అన్నది మనకు తెలియదు. జీవితం ఒక కొనసాగింపు.అది ఆధ్యాత్మిక జ్ఞానం. కానీ వారికి జీవితం కొనసాగింపు అని కూడా తెలియదు. వారు అనుకుంటారు, “అదృష్టవశాత్తూ, నాకు ఈ జీవితం వచ్చింది, మరియు మరణానంతరము అది పూర్తి అవుతుంది. గత, వర్తమాన మరియు భవిష్యత్ అన్న ప్రశ్నే లేదు. మనం ఆనందంగా గడుపుదాం.” దీన్ని అజ్ఞానం అంటారు, తమస, బాధ్యతరహితమైన జీవితం. కాబట్టి అజ్ఞః. అజ్ఞః అనగా జ్ఞానం లేనివాడు అని అర్ధం. మరియు ఎవరైతే అజ్ఞానులో? ఇప్పుడు, తమస. ఎవరైతే అజ్ఞానం రీతులలో ఉన్నవారు. మూడు రకాల భౌతిక మాయలు, తీరులు: సత్త్వ, రజ, తమస. సత్త్వ-గుణ అనగా ప్రతిదీ స్పష్టం.ప్రకాశ. ఏ విధంగా అంటే, ఆకాశం మేఘాలుతో కప్పివుంది: అప్పుడు సూర్య కాంతి స్పష్టంగా ఉండదు. కానీ మేఘాలు పైన సూర్య కాంతి వుంది, ప్రతిదీ స్పష్టంగా ఉంది. మరియు మేఘము లోపల, అక్కడ స్పష్టంగా ఉండదు. అదే విధంగా సత్వ గుణంలో ఉన్నవారికి, వారికి ప్రతి ఒక్కటి స్పష్టంగా వుంటుంది. మరియు తమో-గుణంగా లో ఉన్నవారికి, ప్రతిదీ అజ్ఞానంగా వుంటుంది. మరియు ఎవరైతే మిశ్రమంగా వుంటారో, రజో గుణ కాకుండా, తమో గుణ కాకుండా, మాధ్యమం(మీడియా) ద్వారా, వారిని రజో గుణ అంటారు. మూడు గుణాలు. తమస. కాబట్టి వారు కేవలం శరీరం మీద ఆసక్తి చూపిస్తారు, ఏమి జరగబోతుందో పట్టించుకోరు, మరియు అతను గతంలో ఏమిటి అన్న జ్ఞానం ఉండదు. ఇది వేరొక చోట వివరించబడింది. నునం ప్రమత్తః కురుతే వికారమ [SB 5.5.4] ప్రమత్తః, ఒక పిచ్చివాని విధంగా. అతను పిచ్చివాడిగా ఎందుకు మారాడో అతనుకు తెలియదు.అతను మర్చిపోతాడు. మరియు తన కార్యకలాపాలు ద్వారా తదుపరి ఏమి జరుగుతుంది అన్నది, అతనుకు తెలియదు. పిచ్చివాడు. కాబట్టి ఈ నాగరికత, ఆధునిక నాగరికత, కేవలం పిచ్చివాడి నాగరికత వంటిది. వారికి తమ గత జీవితం యొక్క జ్ఞానం ఉండదు, వారికి తమ భవిష్యత్తు జీవితం గురుంచి కూడా ఆసక్తి ఉండదు. నునం ప్రమత్తః కురుతే వికారమ [SB 5.5.4] వారికి తమ గత జీవితం యొక్క జ్ఞానం ఉండక పూర్తిగా పాపాత్మకమైన కార్యక్రమాలు యందు నిమగ్నం అయ్యి వుంటారు. ఒక కుక్క వలె. అతనుకు తెలియదు ఎందుకు తను కుక్కగా మారాడో. మరియు అతను తదుపరి ఏమి పొందుతాడో? కాబట్టి ఒక కుక్క తన గత జీవితంలో ప్రధాన మంత్రి గా ఉండవచ్చు, కానీ అతను కుక్క జీవితం పొందినప్పుడు అది మర్చిపోతాడు. అది కూడా మాయ యొక్క మరో ప్రభావం. ప్రక్సేపత్మిక-శక్తి, అవరనత్మిక-శక్తి. మాయకు రెండు శక్తులు ఉన్నాయి. ఎవరైనా తన గత పాపపు కార్యకలాపాలు వలన కుక్కగా మారి ఉంటే, మరియు "గతంలో నేను ప్రధాన మంత్రి; ఇప్పుడు నేను కుక్కగా మారాను" అన్నది అతనికి గుర్తు ఉంటే, అతను జీవించడం అసాధ్యం. అందువలన మాయ తన జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. మర్త్యు. మర్త్యు అనగా అర్ధం ప్రతిదీ మర్చిపోవడం. దాన్ని మర్త్యు అని అంటారు. మనకు ప్రతి పగలు మరియు రాత్రి యొక్క అనుభవం ఉంది. రాత్రి పుట మన ఒక ప్రత్యేక వాతావరణం, ప్రత్యేక జీవితాన్ని కలలో చూస్తాం, మనం ఈ శరీరం గురుంచి మర్చిపోతాం, "నేను పడుకొని ఉన్నాను, నా శరీరం ఒక మంచి బహులంతస్తులోని ఇల్లు లో పడుకుని ఉంది, మంచి పరుపు " అని మనం మర్చిపోతాం. అతను వీధిలో వృధాగా తిరుగుతున్నాడు లేదా కొండ మీద ఉన్నాడు అనుకుందాం. అందువలన అతను కలలో తీసుకుంటున్నాడు, అతను తీసుకుంటున్నాడు... అందరూ, మనం ఆ శరీరం గురించి ఆసక్తి చూపిస్తాం. మనం గత శరీరం గురించి మర్చిపోతాం. కాబట్టి ఇది అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం, మనం ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ఎంత పైకి ఎత్తబడతామో, అది విజయవంతమైన జీవితం. మరియు మనము స్వయంగా అజ్ఞానములో ఉంచుకుంటే, అది ఎటువంటి విజయము కాదు. అది జీవితాన్ని చెడగోట్టుకున్నట్లు. కాబట్టి మా కృష్ణ చైతన్య ఉద్యమం లక్ష్యం " ఒక వ్యక్తిని అజ్ఞానం నుండి జ్ఞాన స్థాయికి పెంపొందిచడం". అది వేద సాహిత్యం యొక్క మొత్తం పథకం:వ్యక్తిలో మార్పు తీసుకురావడం. కృష్ణుడు భగవద్గీతలో భక్తులు గురించి చెప్తాడు - అందరి కోసం కాదు - తెసం అహం సముద్ధర్త మర్త్యు-సంసారా-సగారాట్ [భగ 12.7] మరొకటి [భగ 10.11]: తెసం ఎవనుకంపర్థం అహం అజ్ఞాన-జం తమః నసయామి ఆత్మ-భావ-స్తో జనన-దీపేన భాస్వత ప్రత్యేక వారి కోసం, భక్తులు కోసం...ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ ఆయన ఒక భక్తుడు ఎవరైతే కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారికి సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు. భక్తులు కాని వారు కోసం, వారికి కృష్ణునితో ఎటువంటి సంభందం ఉండదు....వారు పశువులు వంటి వారు-తినడం,నిద్రించడం,భోగించడం మరియు రక్షించుకోవడం. వారు దేని గురించి పట్టించుకోరు, భగవంతుడుని అర్థం చేసుకోవడానికి లేదా అతనుకు భగవంతుడుకు ఉన్న సంబంధం ఏమిటి అని. వారు అనుకుంటారు భగవంతుడు లేడు అని, వారి కోసం, కృష్ణుడు కూడా చెప్తాడు," అవును భగవంతుడు లేడు, నువ్వు నిద్రపో." అందువలన సత్-సంగా అవసరం. ఈ సత్-సంగ, సతం ప్రసంగత్. భక్తులు సాహచర్యం ద్వారా, మనము భగవంతుడు గురించి తెలుసుకోవాలనే కోరికను మేల్కొలుపు వచ్చు. అందువలన కేంద్రాలు అవసరం. ఇది అనవసరంగా మేము చాలా కేంద్రాలు తెరుస్తున్నాం అని కాదు. కాదు.ఇది మానవ సమాజం ప్రయోజనం కోసం.