TE/Prabhupada 0741 - ఇదికృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశ్యం: మానవ సమాజమును బాగుచేయుడము

Revision as of 05:22, 21 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0741 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.13 -- Bombay, April 2, 1974


Tathā dehāntara-prāptiḥ. Dehino 'smin yathā dehe ( BG 2.13) జ్ఞానం యొక్క మొదటి అవగాహన ఇది, కానీ ప్రజలు అర్థం చేసుకోరు శరీరం లోపల ఆత్మ ఉంది.వారు ఎంతో అవివేకులు. అందుచే వారు శాస్త్రములో వర్ణించ బడినారు, sa eva go-khrah ( SB 10.84.13) ఈ తరగతి వ్యక్తులు, వారు ఆవులు గాడిదలు కంటే మెరుగైన వారు కాదు. మీరు కొన్ని జంతువుల సభలో సంతోషముగా ఉండలేరు. అందువల్ల ప్రజలు ప్రస్తుత క్షణం ఈ ప్రజలు చాలా కలత చెందుతున్నారు. తెలివి గలవాడు లేడు, ధీర. మీకు సమాజంలో ప్రశాంతమైన జీవితం కావాలంటే, అప్పుడు మీరు ఈ కార్యక్రమమును అంగీకరించాలి. Cātur-varṇyaṁ mayā sṛṣṭam ( BG 4.13) బ్రాహ్మణ తరగతి వ్యక్తులు, క్షత్రియ తరగతి వ్యక్తులు, వైశ్య తరగతి వ్యక్తులు ఉండాలి.

వైశ్య... సాధారణంగా, మనము అర్థం చేసుకుంటాము, వైశ్య అంటే వర్తక తరగతి వ్యక్తులు. కాదు. ప్రస్తుత క్షణాన వైశ్యులు అని పిలవబడే వారు శూద్రులు, శూద్రులు కన్నా తక్కువ. ఎందుకు? ఇప్పుడు వైశ్యుని యొక్క కర్తవ్యము kṛṣi-go-rakṣya-vāṇijyaṁ vyśya-karma svabhvava-jam ( BG 18.44) వైశ్యులు ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో నిమగ్నమై ఉండాలి, కానీ వారికి ఆసక్తి లేదు. వారు బోల్ట్ నట్లు మరియు టైర్లు కోసం కర్మాగారాలు తెరవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, గుడ్విల్ టైర్లు, గుడ్ఇయర్ టైర్లు. ఇప్పుడు మీరు టైర్ బోల్ట్ మరియు నట్ తినండి. లేదు, మీరు తినలేరు. మీరు బియ్యం తినాలి, కిలో బియ్యం పది రూపాయలు. అంతే. ఏ వైశ్యుడు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడము లేదు కనుక. ఇది లోపము.

వారు లోపమును చూడరు. వారు కేవలం ఏడుస్తున్నారు, "ఓ, దాని ధర పెరిగింది" అని తెలిపాడు. ఎందుకు కాదు, ధర పెరిగింది? బొంబాయి నగరంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఎవరు ఆహార ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారు? కానీ వారు వైశ్యులు అని పిలువ బడుతున్నారు. ఏ రకమైన వైశ్య? బ్రాహ్మణ సంస్కృతి లేదు; ఎటువంటి బుద్ధి లేదు. మీకు రక్షణ ఇవ్వగల క్షత్రియుడు లేడు. చాలా లోపాలు ఉన్నాయి.

మీరు మీ జీవితాన్ని, సమాజమును, మానవ సమాజమును తిరిగి నిర్మించాలి అని అనుకుంటే జాతీయముగా లేదా అంతర్జాతీయంగా-ఇక్కడ అంతా మాట్లాడబడినది, అంతర్జాతీయ- అప్పుడు మీరు కృష్ణుడి సలహాను తీసుకోవాలి. ఇది కృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశ్యం: మొత్తముగా ఒక్క సారిగా మొత్తము మానవ సమాజమును బాగుచేయుడము. మనము ఏమి తయారు చేయలేదు, కల్పిత విషయాలు. ఇది చాలా శాస్త్రీయమైనది. మీరు వాస్తవమునకు మీ జీవితం యొక్క లక్ష్యము పూర్తి చేయాలనుకుంటే, అప్పుడు మీరు భగవద్గీత యొక్క ఈ సలహా తీసుకోవాలి, చాలా వైజ్ఞానికం ఏ లోపాలు లేకుండా, భగవంతునిచే మాట్లాడ బడినది

నేను ఏదైనా మాట్లాడితే, చాలా లోపాలు ఉండవచ్చు, ఎందుకంటే నేను అసంపూర్ణంగా ఉన్నాను కనుక. మనలో ప్రతి ఒక్కరు, అపరిపూర్ణము. మనము తప్పు చేస్తాము. తప్పు చేయడము మానవ సహజము. ధైర్యంగా చెప్పగల మానవుడు ఎవ్వరూ లేరు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అది సాధ్యం కాదు. మీరు తప్పు చేయవలసి ఉంది. కొన్నిసార్లు మనము భ్రమ చెందుతాం, ప్రమాద . మనం అందరము, ఎందుకనగా నేను ఈ శరీరాన్ని అంగీకరిస్తున్నాను "నేను," అని , అది నేను కాదు. ఇది ప్రమాద అని పిలువబడుతుంది. భ్రమ, ప్రమాద. తరువాత విప్రలిప్స. నేను భ్రమ కలిగి ఉన్నాను, నేను పొరపాటు చేశాను, నేను తికమకపడ్డాను, నేను భ్రమ పడ్డాను. అయినప్పటికీ, నేను ఉపాధ్యాయుని స్థానమును తీసుకుంటున్నాను. అది మోసం. మీరు లోపభూయిష్టంగా ఉంటే, మీ జీవితంలో చాలా లోపాలు ఉంటే, ఎలా మీరు ఉపాధ్యాయుడు కావచ్చు? మీరు ఒక మోసగాడు. ఎవరూ గురువు కాలేరు, పరిపూర్ణంగా ఉండకుండా, మీరు ఎలా గురువు అవుతారు? కాబట్టి ఇది జరగబోతోంది.