TE/Prabhupada 0207 - భాధ్యతా రహితముగా జీవించవద్దు



Lecture on SB 6.1.16 -- Denver, June 29, 1975

పవిత్రీకరణ చేసే పద్ధతి గురించి మనము చర్చిస్తున్నాము. వివిధ పద్ధతులు వివరించబడ్డాయి, prāyaścitta మరియూ తపస్య ద్వారా. మనము చర్చించాము. ఆ తరువాత kevalayā bhakta. భక్తిలో అన్నీ వున్నవి - కర్మ, జ్ఞాన, యోగా, ప్రతిదీ. ఇది ప్రత్యేకంగా సిఫారసు చేయబడింది, అనగా తపస్సు ద్వారా ఇతర పద్ధతులు ద్వారా అవకాశం ఉంది, కానీ అది విజయవంతం కాకపోవచ్చు. కానీ మనము ఈ భక్తి పద్ధతి ననుసరిస్తే, అది ఖచ్చితంగా విజయవంత మవుతుంది. అందువల్ల ఈ పవిత్రీకరణ పద్ధతి అనగా nivṛtti-mārga అని అర్ధం. pravṛtti-mārga అనగా మనము ఎక్కడికి వెళుతున్నామో అవగాహన లేకుండా పరుగు తీయడమంటిది మనం ఏది నచ్చితే అవన్నీ చేస్తున్నాం. దీనిని pravṛtti-mārga అని పిలుస్తారు. ప్రజలు సాధారణంగా pravṛtti మార్గములో నిమగ్నమై వుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో తరువాత ఏమి జరుగుతుందో నని వారు పట్టించుకోరు. అందువల్ల వారు మరణం తరువాత పునర్జన్మ లేదనుకోని వారు ఉపశమనం పొందుతారు. మనము ఈ జీవితాన్ని మనకు చేతనైనంత వరకు అనుభవిద్ధాము. అప్పుడు మరణం తరువాత ఏమి జరుగుతుందోనని పట్టించుకోవద్దు". మొదటిది, వారు పునర్జన్మ వుంది అనే విస్వాశాన్ని తిరస్కరిస్తారు. తదుపరి పునర్జన్మ ఉన్నా నేను పిల్లి గానో లేదా కుక్క గానో పుడుతున్నా, వారు పట్టించుకోవడం లేదు. ఇది ఆధునిక జీవితం యొక్క అనుభవం. బాధ్యతారహితమైన జీవితం. కానీ మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు బోధిస్తుంది "బాధ్యతారహితంగా నివసించకండి." ఈ ఉదాహరణ తీసుకోండి, "పునర్జన్మ లేదు" అని మీరు అనవచ్చు. కానీ నేను " పునర్జన్మ ఉంది ..." అనే వాదనను తీసుకొనివస్తే, ఇప్పుడు ఇది కూడా మాట వరసకే, ఎందుకనగా ఎవరూలేరు ...ఎవరైతే అజ్ఞానంలో వున్నారో, వారికి తెలియదు, పునర్జన్మ వుందో లేదో. మీరు వాదిస్తున్నారు, "పునర్జన్మ లేదు" అని, కానీ పునర్జన్మ వుందో లేదో మీకు తెలియదు. అది మీ ఎరుకలో లేదు. మీరు ఈ రెండు మార్గాలు తీసుకొని ఆలోచించ వలసి వస్తే .... మీరు పునర్జన్మ లేదనే పాయింట్ మీదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు, "పునర్జన్మ వుంది" అనే నా ప్రతిపాదన ఎందుకు తీసుకొనరు? ఎందుకంటే మీకు పునర్జన్మ వున్నదా లేదా అనేది ఖచ్చితముగా తెలియదు . మనము పునర్జన్మ వుంటుంది అని అంటున్నాము. మనము ఈ ఉదాహరణను తీసుకుందాము: ఈ బిడ్డ తన తరువాతి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగానే. బిడ్డ ఇలా చెప్పవచ్చు, "తరువాత మరియొక జీవితము లేదు." వాస్తవానికి అది వాస్తవం కాదు. నిజానికి, జీవితం ఉంది. బిడ్డ యొక్క ఈ శరీరం మారుతుంది మరియూ కుర్రవాడు అవుతాడు. కుర్రవాని ఈ శరీరం మారుతుంది; అతను యువకుడు అవుతాడు. అది నిజం. కానీ మీరు పునర్జన్మ లేదని మూర్ఖముగా చెప్పాలంటే, మీరు చెప్పవచ్చు. కానీ ఈ వాదనని చూడండి:పునర్జన్మ ఉంటే, అప్పుడు ఎంత బాధ్యతారహితంగా, మీరు మీ భవిష్య జీవితాన్ని చీకటిగా చేసుకొంటున్నారో? అదే ఉదాహరణ: పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే, విద్యను పొందకపోతే, పిల్లవాడు ఇలా అనుకుంటే, "ఈ జీవితం కంటే ఇతర జీవితం ఏదీ లేదు, నేను రోజంతా ఆడతాను, నేను పాఠశాలకు ఎందుకు వెళ్ళాలి?" అతను అలా చెప్పవచ్చు, కానీ జీవితం ఉంది, అతను కనుక విద్యను తీసుకొనకపోతే, తరువాతి జీవితంలో, అతడు యువకుడుగా ఉన్నప్పుడు, తను మంచి స్థానములో నియమించబడక పొతే అప్పుడు అతను బాధపడతాడు. ఇది బాధ్యత లేని జీవితం.

మనము తరువాతి జీవితాన్ని పొందక ముందే, మనము పాపభరితమైన జీవితాల నుండి తప్పకుండా విముక్తి పొందాలి. లేకపోతే మనం మంచి జీవితాన్ని పొందలేము. ముఖ్యంగా ఇంటికి తిరిగి వెళ్ళటానికి, తిరిగి భగవంతుని దగ్గరకు, ఈ జీవితంలోనే తన మిగిలిన పాపాత్మకమైన కర్మలను పూర్తి చేయవలసి ఉంటుంది. భగవద్గీతలో మీరు కనుగొంటారు,

yeṣām tv anta-gataṁ pāpaṁ

janānāṁ puṇya-karmaṇāṁ

te dvandva-moha-nirmuktā

bhajante māṁ dṛḍha-vratāḥ

(BG 7.28)

కృష్ణుని యొక్క స్థిరమైన భక్తునిగా, ఉత్తమమైన భక్తునిగా, అనగా పాపభరితమైన జీవితపు అన్ని ప్రతిచర్యల నుండి తను విముక్తి పొందటము. Yeṣām anta-gataṁ pāpam. ఏ పాపాత్మకమైన చర్యలు ఇకముందు చేయకూడదు. మరియూ తను తన పూర్వ జీవితంలో చేసిన ఏ పాపాత్మకమైన చర్యలు, అవి కూడా నిర్మూలించబడిన తరువాత. అవి కూడా నిర్ములించబడాలి. ఇంక ఏ విధమైన ప్రతిచర్యలు వుండవు. Yeṣām tu anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām. పాపపు కార్యకలాపాల్లో గానీ లేదా పవిత్ర కార్యక్రమాలలో గానీ ప్రజలు నిమగ్నమై వుంటారు. కనుక ఎవరైతే వారి గత పాపాత్మకమైన చర్యల ఫలితాన్ని పూర్తి చేయడమే కాకుండా, మరియూ ప్రస్తుత సమయములో కూడా వారు కేవలం పవిత్ర కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉంటారో, అటువంటి వ్యక్తి, yeṣāṁ tu anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām, te, అటువంటి వ్యక్తి, dvandva-moha-nirmuktā, ఎటువంటి అనిశ్చత లేకుండా, ఎటువంటి సందేహము లేకుండా, bhajante māṁ dṛḍha-vratāḥ. అంటే, ఎవరైతే ధృడమైన భక్తితో కృష్ణుని సేవలో నిమగ్నమై ఉంటారో, పాపభరితమైన కార్యములన్నిటి ప్రతి చర్యల నుండి ఇప్పుడు అతను ముక్తుడైనాడని అర్ధం.