TE/Prabhupada 0485 - కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0485 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 03:28, 29 September 2017



Lecture -- Seattle, October 18, 1968


అతిథి: నేను మీరు జగన్నాథ రథ పండుగ యొక్క మూలం మరియు ప్రాముఖ్యతను వివరించాలని కోరుకుంటున్నాను, వారు జగన్నాథ రథ పండుగని పిలుస్తారు.

ప్రభుపాద: జగన్నాథ పండుగ ప్రాముఖ్యత, కృష్ణుడు వృందావనమును విడిచిపెట్టినప్పుడు. కృష్ణుడు తన పెంపుడు తండ్రి అయిన నంద మహారాజ చేత పెంచబడ్డాడు. కాని ఆయన పెరిగినప్పుడు, 16 సంవత్సరాల వయస్సులో, ఆయన ఆయన వాస్తవమైన తండ్రి, వసుదేవ, వారు వృందావనం విడిచి వెళ్లారు, కృష్ణ బలరామ, ఇద్దరు సోదరులు,... వారు నివాసితులు... వారి రాజ్యం ద్వారకలో ఉంది. కాబట్టి కురుక్షేత్రంలో - కురుక్షేత్ర ఎల్లప్పుడూ ధర్మ-క్షేత్ర, యాత్రా స్థలము - కొంత చంద్ర, సూర్య గ్రహణం ఉంది, భారతదేశం యొక్క అనేక ప్రాంతాల నుండి అనేక మంది వ్యక్తులు, వారు స్నానం చేయడానికి వచ్చారు. అదేవిధముగా, కృష్ణ బలరామ మరియు వారి సోదరి సుభద్ర, వారు కూడా రాజుల రీతిలో వచ్చారు, చాలా మంది సైనికులతో, చాలామంది ... రాజులలాగానే. కాబట్టి వృందావనము యొక్క నివాసితులు, వారు కృష్ణుడిని కలుసుకున్నారు, ముఖ్యంగా గోపికలు, వారు కృష్ణుడిని చూశారు, వారు "కృష్ణ, నీవు ఇక్కడ ఉన్నావు, మేము కూడా ఇక్కడ ఉన్నాము అని విలపించారు కాని ప్రదేశము భిన్నంగా ఉన్నది. మనము వృందావనములో లేము." అందువల్ల వారు ఏ విధముగా విలపించారో, వారిని ఎలా కృష్ణుడు శాంతింపజేశారో చాలా పెద్ద కథ ఉన్నది. ఇది విడిపోయారనే భావం. ఇది వృందావన నివాసులు ఎలా అనుభవించారు కృష్ణుడి నుండి విడిపోయే భావనను. ఈ విధముగా ... కృష్ణుడు రథం మీద వచ్చినప్పుడు, దీనిని రథ-యత్ర అని పిలుస్తారు. ఇది రథ-యాత్ర యొక్క చరిత్ర. కాబట్టి కృష్ణుడి చేసిన ఏ లీల అయిన, భక్తులు ఉత్సవముగా ఆచరిస్తారు. కాబట్టి అది రథ-యాత్ర