TE/Prabhupada 0841 - ఆధ్యాత్మికంగా, జన్మించడము మరియు మరణించడము మధ్య, ఏ తేడా లేదు

Revision as of 15:21, 15 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0841 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


731213 - Lecture Festival Disappearance Day, Bhaktisiddhanta Sarasvati - Los Angeles


nama oṁ viṣṇu-pādāya
kṛṣṇa-preṣṭhāya bhūtale
śrīmate bhaktisiddhānta
sarasvatīti nāmine

ఈ భౌతిక ప్రపంచం నుండి భక్తి సిద్దాంత సరస్వతి ఠాకురా వెళ్ళిపోయినారు డిసెంబర్ 31, 1936 న. దాదాపు నలభై సంవత్సరాల క్రితము. అందువల్ల రెండు దశలు ఉన్నాయి, ప్రకట అప్రకట, ఆవిర్భావము మరియు తిరోభావము. కాబట్టి మనము తిరోభావము గురించి విచారించవలసినది ఏమీ లేదు ఎందుకంటే కృష్ణుడి మరియు కృష్ణుడి భక్తులు... భక్తులు మాత్రమే కాదు,అభక్తులు కూడా, ఎవరు మరణించరు. ఎవరు మరణించరు ఎందుకంటే ప్రతి జీవి... కృష్ణుడు శాశ్వతము కనుక... ఇది వేదముల సాహిత్యంలో ధృవీకరించబడింది, nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). భగవంతుడు యొక్క వర్ణన ఏమిటంటే ఆయన కూడా నిత్య, శాశ్వతము, జీవులు కూడా శాశ్వతమైన వారు. కానీ అతడు ప్రధాన శాశ్వతమైనవాడు. Nityo nityānāṁ cetanaś cetanānām. కాబట్టి గుణాత్మకంగా, కృష్ణుడి మరియు జీవుల మధ్య తేడా ఉండదు. పరిమాణాత్మకంగా, వ్యత్యాసం ఉంది. నిత్య, ఏక వచనమునకు, బహువచనమునకు మధ్య తేడా ఏమిటి? బహువచనం నిత్య సేవకుడు, ఏక వచనము నిత్య యొక్క శాశ్వత సేవకుడు. ఉదాహరణకు మీరు ఎవరికైనా సేవ చేయాలని కోరుకుంటే, గురువు కూడా సరిగ్గా మీలానే ఉంటారు. ఆయన రెండు చేతులు, రెండు కాళ్ళు, లేదా అదే భావనలు కలిగి ఉన్నాడు. ఆయన కూడా తింటాడు. ప్రతిదీ ఒకే రకముగా ఉంటుంది. కానీ తేడా గురువు మరియు సేవకుడు. అంతే. లేకపోతే, ప్రతి విషయములో సమానంగా ఉంటుంది.

ఆధ్యాత్మికంగా, జన్మించడము మరియు మరణించడము మధ్య, ఏ తేడా లేదు. ఉదాహరణకు భౌతిక దృష్టిలో, ఒక వ్యక్తి జన్మించినప్పుడు... ఉదాహరణకు మీకు కొడుకు పుడితే, మీరు చాలా ఆనందంగా ఉంటారు. అదే కుమారుడు, మరణిస్తే, మీరు చాలా దుఃఖముగా ఉంటారు. ఇది భౌతికము. ఆధ్యాత్మికంగా, ఇటువంటి వ్యత్యాసం లేదు, జన్మించడము మరియు మరణించడమునకు అయితే ఇది ఓం విష్ణుపాద శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా తిరోభావతిథి రోజు అయినప్పటికీ, కాబట్టి విచారించవలసిన అవసరము లేదు. మనము విరహము అనుభూతి చెందినప్పటికీ, ఆ భావన ఉంది, కానీ ఆధ్యాత్మికంగా, జన్మించడము మరియు మరణించడమునకు మధ్య వ్యత్యాసం లేదు. ఒక పాట ఉంది, నరోత్తమ దాస ఠాకురా యొక్క పాట ఉంది, యే అనిలో ప్రేమ ధన. మీకు తెలుసా, మీలో ఎవరికైనా? ఆ పాటను మీలో ఎవరైనా పాడగలరా? ఓ. Ye anilo prema-dhana, karuṇā pracura, heno prabhu kothā gelo. నాకు మొత్తము పాట ఖచ్చితముగా గుర్తు లేదు. అది.... శ్రీల భక్తి సిద్దంత సరస్వతి ఠాకురా ఈ సందేశాన్ని అందరికీ ప్రచారము చేయడానికి తీసుకు వచ్చారు... నిజమే, శ్రీ చైతన్య మహా ప్రభు తన కోరికను వ్యక్తం చేశారు, అది ఏమిటంటే

pṛthivīte āche yata nagarādi-grāma
sarvatra pracāra haibe mora nāma
(CB Antya-khaṇḍa 4.126)

ఆయన "ప్రపంచవ్యాప్తంగా, ఎన్ని పట్టణాలు గ్రామాలు ఉన్నాయో, ప్రతిచోటా నా నామము తెలుస్తుంది. "శ్రీ చైతన్య మహా ప్రభు పేరు అని భవిష్య వాణి చెప్పారు ఇప్పుడు అది, ఇప్పుడు ప్రయత్నించబడుతుంది, వాస్తవానికి ఇది ఉంది... శ్రీ చైతన్య మహా ప్రభు యొక్క ఈ సంకల్పమును అమలు చేయడానికి, ఆయన వ్యక్తిగతంగా ఇలా చెప్పారు,

bhārata bhūmīte manuṣya janma haila yāra
janma sārthaka kari kara para-upakāra
CC Adi 9.41

ఆయన ప్రతి నగరములో మరియు గ్రామంలో ఆయన నామమును ప్రపంచ వ్యాప్తంగా ప్రచారము చేయాలని ఆయన కోరుకున్నాడు. ఎవరు చేస్తారు? ఆయన అడిగారు ఎవరైనా జన్మ తీసుకున్నవారు భారతదేశంలో, భరత-వర్షలో, ఇది ఆయన కర్తవ్యము: మొట్ట మొదట శ్రీ చైతన్య మహా ప్రభు యొక్క తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవటం ద్వారా తనను తాను పరిపూర్ణంగా చేసుకుంటాడు; తరువాత, ప్రచారము చేసి, పంపిణి చేస్తాడు. ఇది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత. భారతీయులు, ముఖ్యంగా భారతదేశంలో, వేదముల సాహిత్యం యొక్క లాభమును పొందేందుకు వారికి ప్రత్యేక అర్హత ఉంది. ఇతర దేశాలలో అటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఎవరైనా తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు ఆయన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విస్తారమైన నిధిని ఉపయోగించుకోవాలి.