TE/Prabhupada 0878 - భారతదేశంలో వేదముల నాగరికత పతనం

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730412 - Lecture SB 01.08.20 - New York


భారతదేశంలో వేదముల నాగరికత పతనం.

ప్రద్యుమ్న: అనువాదం: "మీకు మీరుగా భక్తియుక్త సేవ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును ప్రచారం చేయడానికి వచ్చారు పవిత్రులైన ఉన్నతమైన ఆధ్యాత్మికవాదులు మరియు మానసిక కల్పనాపరుల హృదయాలలో భౌతిక పదార్ధము మరియు ఆత్మ మధ్య వివక్షతను కలిగి యుండటము ద్వారా. ఎలా అప్పుడు మేము మహిళలము పరిపూర్ణంగా మిమ్మల్ని తెలుసుకోవచ్చు? "

ప్రభుపాద: కావున కుంతీదేవి, ఆమె విధేయతతో ఉంది... ఇది వైష్ణవుని యొక్క లక్షణం. ఆమె పాదాల దుమ్ము తీసుకోవటానికి కృష్ణుడు భగవంతుడు, కుంతిదేవి దగ్గరకు వచ్చాడు. ఎందుకనగా కృష్ణుడు కుంతీదేవిని తన అత్తగా భావించాడు, ఆమెకు గౌరవమును ఇవ్వడానికి వచ్చాడు కృష్ణుడు కుంతీదేవి యొక్క పాదములను తాకేవాడు కానీ కుంతీదేవి, ఆమె అటువంటి అత్యున్నత పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆచరణాత్మకంగా యశోదామయి యొక్క స్థాయిలో, అటువంటి గొప్ప భక్తురాలు... కాబట్టి ఆమె అలా వినయముగా ఉంది కృష్ణ, మీరు పరమహంసల కోసం ఉద్దేశించబడినారు, మేము ఎలా నిన్ను చూడగలము? మేము మహిళలము."

అందువల్ల భగవద్గీతలో చెప్పబడింది, striyo vaiśyās tathā śūdrāḥ ( BG 9.32) భాగవతములో మరొక ప్రదేశంలో ఇది చెప్పబడింది, strī-śūdra-dvijabandhūnām. శూద్ర, స్త్రీ మరియు ద్విజబంధు. ద్విజబంధు అనగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు లేదా క్షత్రియ కుటుంబములో, అధిక కులములో... వేదముల పద్ధతి ప్రకారం, నాలుగు విభాగాలు ఉన్నాయి: లక్షణము మరియు పని ప్రకారం, మొదటి-తరగతి వ్యక్తులు బ్రాహ్మణులు, తెలివైనవారు. తరువాత, క్షత్రియులు; తరువాత, వైశ్యులు; తదుపరి, శూద్రులు. కాబట్టి ఈ వర్గీకరణ ప్రకారం, మహిళలు, ద్విజ బంధు, ద్విజ బంధు అంటే, వారిని ఒకే వర్గములో తీసుకున్నారు. ద్విజ బంధు అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవారు , క్షత్రియ కుటుంబములోని వారు, కానీ అర్హతలు లేవు. ఈ విషయమును యోగ్యత ద్వారా పరిగణించవలసి ఉంది. ఇది చాలా ఆచరణాత్మకమైనది. ఉదాహరణకు ఒక మనిషి ఒక హైకోర్టు న్యాయమూర్తి కుమారునిగా జన్మించాడు అనుకుందాం. అతడు హైకోర్టు న్యాయమూర్తికి కుమారుడు కనుక, ఆయన కూడా హైకోర్టు న్యాయాధిపతి అని కాదు. ఇది జరుగుతోంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు, ఏ అర్హత లేకుండా, ఆయన ఒక బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు. ఇది భారతదేశంలో వేదముల నాగరికత పతనం. ఒక నంబర్ వన్ మూర్ఖుడు, అతడు తనకు తాను ఒక బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్నాడు - ఏ అర్హత లేకుండా. ఆయన అర్హత శూద్రుని కంటే తక్కువ; ఇప్పటికీ ఆయన చెప్పుకుంటున్నాడు. అది అంగీకరించబడింది.

కాబట్టి ఇది స్పష్టంగా చెప్పబడింది: guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) అర్హత లేకుండా... బ్రాహ్మణ అంటే అర్హతలు. ఇది ఈ శరీరం కాదు. చాలా వాదనలు ఉన్నాయి, కానీ వారు వినలేరు. నా ఉద్యమంలో వారు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఐరోపా మరియు అమెరికా నుండి నేను బ్రాహ్మణులను నేను తయారు చేస్తున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ పట్టించుకోవద్దు, మనము వారిని పట్టించుకోము. కనీస తెలివి ఉన్న వ్యక్తి అయినా వారిని పట్టించు కోడు. కానీ నాకు వ్యతిరేకంగా ప్రచారం ఉంది. నా Godbrothers లో కూడా, వారు తయారు చేస్తున్నారు... వారు దీన్ని చేయలేరు కనుక, కొన్ని తప్పులను కనుగొంటున్నారు. మీరు చూడండి