TE/Prabhupada 0210 - భక్తి మార్గము మొత్తం భగవంతుని కృపపై ఆధార పడి వుంటుంది



Lecture on SB 1.15.30 -- Los Angeles, December 8, 1973


మీరు భగవద్గీతని అర్థం చేసుకోవాలంటే, మనము ప్రత్యక్షంగా విన్న వ్యక్తిలా అలాగే అర్థం చేసుకోవాలి. దీనిని పరంపర పద్ధతి అని పిలుస్తారు. నేను నా ఆధ్యాత్మిక గురువు నుండి ఏదన్నా విన్నాను అనుకోండి. కనుక నేను అదే మీకు చెబుతాను. ఇది పరంపర పద్ధతి. నా ఆధ్యాత్మిక గురువు చెప్పినది మీరు ఊహించలేరు. లేదా మీరు కొన్ని పుస్తకాలను చదవగలిగినా, నా నుండి అర్ధం చేసుకుంటే తప్ప మీరు అర్ధం చేసుకోలేరు. దీనిని పరంపర పద్ధతి అని పిలుస్తారు. మీరు పై గురువునకు దాటుకొని వెళ్లలేరు, నేను చెప్పేది ఏమనగా, మీ తరువాత ఆచార్యుని నిర్లక్ష్యం చేసి, మీ సమీప ఆచార్యుని మన దాని లాగానే, ఈ గౌ ..., చైతన్య మహాప్రభుు యొక్క ఆచార క్రమము; మనము నేరుగా చైతన్య మహాప్రభును అర్థం చేసుకోలేము. ఇది సాధ్యం కాదు. మనము గోస్వాముల ద్వారా అర్థం చేసుకోవాలి. అందువల్ల మీరు చైతన్య-చరితామ్రుతంలో కనుగొంటారు మరియు ప్రతి అధ్యాయం ముగింపులో, రచయిత ఇలా అంటున్నారు, rūpa-ragunātha-pade... అంటే ఏమిటి? కృష్ణదాస.

Rūpa-ragunātha-pade sada yāra āśa
caitanya-caritāmṛta kahe kṛṣṇa-dāsa

ఇది పద్ధతి. ఆయన "నేను చైతన్య మహాప్రభును నేరుగా అర్థం చేసుకున్నాను" అని అనలేదు. కాదు. అది అర్ధం చేసుకున్నట్లు కాదు. అది మూర్ఖత్వం. మీరు చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోలేరు. అందువలన పదేపదే ఆయన అంటారు, rūpa-ragunātha-pade sada yāra āśa caitanya-caritāmṛta kahe kṛṣṇa-dāsa. నేను కృష్ణ దాస కవిరాజుని, నేను ఎల్లప్పుడూ గోస్వామీల సేవకుడనై ఉన్నాను. ఇది పరంపర పద్ధతి. అదేవిధంగా, నరోత్తమ దాస ఠాకుర కూడా అంటారు, Ei chay gosāi jār tār mui dās, ఎవరైతే షట్ గోస్వామీలను గురువుగా అంగీకరిస్తారో, నేను వారి దాసుడను. నేను .... మార్గం మరియు సాధనలను ఆమోదించని ఏ ఇతర వ్యక్తుల సేవకునిగా ఉండబోను" కనుక మనం చెప్తాము, లేదా మన ఆధ్యాత్మిక గురువుకు మనము ప్రార్ధన చేస్తాము, Rūpānuga-varāya te, rūpānuga-varāya te, ఎందుకంటే ఆయన Rupa Gosvāmī ను అనుసరిస్తున్నాడు, అందుచే మనము ఆధ్యాత్మిక గురువుని అంగీకరిస్తాము. Rupa Gosvāmī కంటే కాని మరి ఇంకొకరికంటే కాని ఎక్కువ అని కాదు ... కాదు. Tāṅdera caraṇa-sebi-bhakta-sane vās. ఇది పరంపర పద్ధతి.

ఇప్పుడే ఇక్కడ అదే పునరావృతమవుతుంది: కృష్ణుడినుండి నేరుగా విన్న అర్జునుడు. కొన్నిసార్లు, కొంతమంది అంటారు - ఇది మూర్ఖము - అనగా "అర్జునుడు కృష్ణుడినుండి నేరుగా విన్నాడు", కానీ మన సమక్షంలో కృష్ణుని కనుగొనలేకపోతున్నాం, కనుక "నేను ఎలా అంగీకరించగలను? " ప్రత్యక్షముగా కనబడటము అనేది ప్రశ్న కాదు. ఎందుకంటె మీకు సంపూర్ణ జ్ఞానము గురించి తెలియదు. కృష్ణుని మాటలు, భగవద్గీత, కృష్ణుని నుండి భిన్నమైనవి కాదు. ఇది కృష్ణుడినుండి భిన్నంగా లేదు. మీరు భగవద్గీత విన్నప్పుడు, మీరు కృష్ణుడినుండి ప్రత్యక్షంగా వింటున్నారు, ఎందుకంటే కృష్ణుడు భిన్నముగా లేడు. కృష్ణుడు సంపూర్ణుడు. కృష్ణుడు, కృష్ణుని పేరు, కృష్ణుని రూపం, కృష్ణుని యొక్క లక్షణము, కృష్ణుని ఉపదేశము, కృష్ణుని యొక్క ప్రతీది కృష్ణుడే. అవి అన్ని కృష్ణుడే. ఇది అర్థం చేసుకోవాలి. అవి కృష్ణునినుండి భిన్నంగా లేవు అందువలన ఇక్కడ వున్న కృష్ణ రూపం, అతను కృష్ణుడు. అయిన విగ్రహం కాదు. "ఆయిన ఒక పాలరాయి విగ్రహం" కాదు. ఆయన కృష్ణుడు. మీరు కృష్ణుని చూడ లేరు కనుక ఆయన మీ ముందు కనిపించారు మీరు రాయి, చెక్కని చూడగలరు; అందువలన ఆయన ఆ రూపంలో ఆవిర్భవించారు. ఇది రాయి మరియు చెక్క అని మీరు అనుకుంటారు, కానీ ఆయన రాయి చెక్క కాదు; ఆయన కృష్ణుడు. దీనిని పరమ వాస్తవము అంటారు. అదేవిధంగా, కృష్ణుని మాటలు కూడా కృష్ణుని నుండి భిన్నంగా లేవు. కృష్ణుని మాటలు భగవద్గీతలో ఉన్నప్పుడు, అది కృష్ణుడే.

దక్షిణ భారతీయ బ్రాహ్మణుని లాగానే. ఆయన తెరవగానే ...... ఆయన నిరక్షరాస్యుడు, ఆయన భగవద్గీత చదవలేక పోయాడు. కానీ ఆయన గురు మహారాజు చెప్పారు, "భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి రోజు చదువుకోవాలి" అని. కనుక అతను కలవర పడ్డాడు, "నేను నిరక్షరాస్యుడను, నావల్ల కాదు ...... నిజమైతే, నేను భగవద్గీత తీసుకుంటాను." ఆయన రంగనాధ ఆలయంలో ఉన్నాడు. అతను భగవద్గీత తీసుకున్నాడు మరియు ఇలా తిప్పాడు. అతను చదవలేకపోయాడు. తనని తెలిసిన తన మిత్రులు పరిహాసం చేస్తున్నారు, "బ్రాహ్మణా, భగవద్గీత ఎలా చదువుతున్నావు?" అతను సమాధానం చెప్పలేదు, ఎందుకంటే తన స్నేహితులు తనని ఎగతాళి చేస్తున్నారని తనకి తెలుసు, ఎందుకంటే "నాకు తెలియదు ... నేను నిరక్షరాస్యుడను." కానీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు, ఆయన కూడా కలవర పడ్డాడు, "బ్రాహ్మణా, మీరు భగవద్గీత చదువుతున్నారా?" ఆయన అన్నాడు, "సర్, నేను నిరక్షరాస్యుడను, నేను చదవలేను, ఇది సాధ్యం కాదు." "కానీ నా గురు మహారాజు నన్ను చదవాలని ఆదేశించారు. నేను ఏమి చెయ్యగలను? నేను ఈ పుస్తకం తీసుకున్నాను. " ఇది గురువు మాటలను స్థిరముగా ఆచరించే వాడంటే. అతను నిరక్షరాస్యుడు. ఆయన చదవలేడు. అవకాశం లేదు. కానీ అతని గురు మహరాజు ఆదేశించాడు, "మీరు భగవద్గీత రోజూ, పద్దెనిమిది అధ్యాయాలను చదవాలి" అని ఇప్పుడు ఇది ఏమిటి? దీన్ని vyavasāyātmikā buddhiḥ అని అంటారు. నేను చాలా అసంపూర్ణముగా ఉండవచ్చు. అది అప్రమేయము. కానీ నా గురు మహారాజు యొక్క ఉపదేశాలను అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు, నేను సంపూర్ణుడిని అవుతాను.

ఇదీ రహస్యం. Yasya deve parā bhaktir yathā deve tathā gurau (ŚU 6.23). ఒక వ్యక్తి దేవాదిదేవుని యందు పూర్తి విశ్వాసము, అంతే విశ్వాసము గురువు పై ఉన్నట్లయితే, yathā deve tathā gurau, అప్పుడు తెలిసిన గ్రంథాలే వ్యక్తమవుతాయి. ఇది విద్య కాదు. ఇది పాండిత్యము కాదు. ఇది కృష్ణుడు మరియు గురువు యందు గల విశ్వాసము. అందువల్ల చైతన్య-చరితామ్రుతము చెబుతుంది, guru-kṛṣṇa-kṛpāya pāya bhakti-latā-bīja ( CC Madhya 19.151) విద్య ద్వారా కాదు, పాండిత్యము ద్వారా కాదు. ఎప్పుడూ చెప్పదు. చైతన్య మహా ప్రభు చెప్పినట్లు, guru-kṛṣṇa-kṛpāya, గురువు యొక్క కృపతో మరియు కృష్ణుని యొక్క కృపతో ఇది కృపకి సంభందించిన ప్రశ్న. ఇది పాండిత్యము లేదా సంపద లేదా గొప్పతనముకు సంభందించిన ప్రశ్న కాదు. కానే కాదు. మొత్తం భక్తి-మార్గము భగవంతుని యొక్క దయ మీద ఆధారపడి ఉంటుంది. మనం కృపని వెదకాలి. Athāpi te deva padābubuja-dvaya-prasāda-leśānugṛhta eva hi, jānāti tattvam ... ( SB 10.14.29) Prasāda-leśa, leśa అంటే చాలా చిన్న భాగము. దేవాదిదేవుని యొక్క దయను ఏ కొంచమైన పొందిన వ్యక్తి, అతను అర్థం చేసుకోగలడు. ఇతరులు, na cāyaya eko 'pi ciraṁ vicinvan. ఇతరులు, వారు లక్షలాది సంవత్సరాలుగా ఊహా కల్పన చేయవచ్చు. అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల భగవద్గీత యధావిధిగా మనం ప్రదర్శిస్తున్నాం, ఎందుకంటే అర్జునుడు అర్థం చేసుకున్న విధముగానే మనము భగవద్గీతను ప్రదర్శిస్తున్నాం. మనము డాక్టర్ రాధా కృష్ణ వద్దకు గాని, ఈ పండితుడు మరియూ ఆ పండితుడు, ఈ మూర్ఖుడు, ఆ మూ .... కాదు. మనము వెళ్ళము. అది మన కార్యము కాదు. అదీ పరంపర.