TE/Prabhupada 0381 - దశావతారము స్తోత్రము యొక్క భాష్యము



Purport to Sri Dasavatara Stotra -- Los Angeles, February 18, 1970


Pralaya-payodhi-jale-dhṛtavān asi vedam, vihita-vahitra-caritram akhedam. నేడు కృష్ణుడు వరాహ అవతారంలో అవతరించిన రోజు. ఈ ప్రపంచమంతా గర్భోధక సముద్రపు నీటిలో మునిగినపుడు కృష్ణుడు ప్రపంచాన్నీ ఎత్తాడు. మనము చూస్తున్న విశ్వం, ఇది సగం మాత్రమే. మిగిలిన సగం నీటితో నింపబడినది, మరియు ఆ నీటిలో గర్భోదకశాయి విష్ణు ఉన్నారు. కాని హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూసంబంధమైన గ్రహాన్ని ఆ నీటిలోకి తోసేశారు, ఆ భూసంబంధమైన గ్రహం నీటి నుండి వరాహ రూపం లో కృష్ణుడు రక్షించారు . ఆ శుభపర్వదినం ఈరోజు,వరాహ ద్వాదశి . దీనినే వరాహ ద్వాదశి అంటారు . అటువంటి ఈ రోజున, విశ్వములో భగవంతుణ్ణి వేర్వేరు రూపాలలో కీర్తించడం మంచిది. మొదటి అవతరం చేప రూపం.

ఈ ప్రార్ధనలు జయదేవ గోస్వామిచే అర్పించబడ్డాయి . చైతన్య మహాప్రభు రూపానికి సుమారు ఏడు వందల సంవత్సరముల క్రితమే ఒక వైష్ణవ కవి ఆగమనం చేసారు. అతను గొప్ప భక్తుడు, అతని ప్రత్యేక కవిత్వం, గీత –గోవింద. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. గీత -గోవింద రాధారాణి గురించి వేణువు మీద కృష్ణుడి ఊదిన అంశం. ఇది గీత -గోవింద యొక్క భౌతిక విషయం. అదే కవి, జయదేవ గోస్వామి ప్రార్ధనలు సమర్పించారు. pralaya-payodhi-jale-dhṛtavān asi vedam. అతను చెప్పాడు , “నా ప్రియమైన ప్రభు, ఈ విశ్వంలో వినాశనం ఉన్నప్పుడు, ప్రతిదీ నీటితో నిండిపోయింది. ఆ సమయంలో మీరు ఒక పడవలో పేర్చబడిన వేదాలను రక్షించారు. గొప్ప చేప ఆకారంలో నీటిలో మునిగిపోకుండా పడవని పట్టుకున్నారు ". మొదట ఈ చేప ఒక చిన్న చేప వలె నీటి కుండలో దొరుకుతుంది. అప్పుడు అది విస్తరించి, చేప గొప్ప నీటి మడుగులో ఉంచబడినది. ఈ విధముగా చేప పెరుగుతోంది . అప్పుడు చేప " వినాశనం వస్తోందని తెలియజేసింది. నీవు పడవలో అన్ని వేదాలను కాపాడు, నేను దానిని కాపాడుతాను. జయదేవ గోస్వామి ప్రార్ధనలు చేస్తున్నాడు, నా ప్రభు, మీరు వేదాలను కాపాడారు ఒక చేప ఆకారంలో వినాశనం ఉన్నప్పుడు,"

తర్వాత కూర్మావతార. సముద్రములో చిలకటము ఉంది. ఒక వైపు అందరూ దేవతలు ఒక వైపు అందరూ రాక్షసులు. చిలకటమునకు ఉపయోగించిన కవ్వము మంధర-పర్వత అనే గొప్ప పర్వతము. పర్వతము భగవంతుని వీపు మీద ఉంది, భగవంతుడు ఒక తాబేలు వలె అవతరించారు అతను తన ప్రార్ధనను చేస్తున్నాడు,“ఆధారముగా ఉండడానికి మీరు తాబేలుగా అవతరించారు. మీ వీపు మీద మీరు కొoతా దురద భావాన అనుభవిస్తున్నందువల్ల ఇది జరిగింది. మీరు ఈ పెద్ద కర్రను, మంధర పర్వతాన్ని ,దురద పోగుట్టుకోవడానికి ఉపయోగించారు

తర్వాత అవతారం ఈ వరాహ, ఆడవి పంది లేదా పంది. ఆయన ఈ భూ గ్రహంను తన దంతం ద్వారా రక్షించారు. ఆయన మొత్తం ప్రపంచాన్ని ఆయన దంతం మీద ఉంచుకున్నారు. ఆయన ఎంత పెద్దగా కనిపించారో అని మనము ఊహించుకోగలము. ఆ సమయంలో ప్రపంచము కొన్ని మచ్చలు కలిగిన చంద్రుని బింబం లాగానే కనిపించింది. keśava dhṛta-varāha-śarīra. అతను చెప్పాడు , “నా ప్రియమైన ప్రభు, మీరు గొప్ప వరాహం లాగా కనిపించారు. కనుక మీకు నా గౌరవప్రదమైన ఆరాధనలను అందించనివ్వండి”.

నాల్గవ అవతారం నృసింహ-దేవ. నృసింహ-దేవ ప్రహ్లాద మహారాజాను రక్షించడానికి ఆవిర్భవించారు, ఇతను ఐదు సంవత్సరాల బాలుడు మరియు అతడు నాస్తిక తండ్రిచే హింసించబడ్డాడు. అందువలన, అతను సగం మనిషి, సగం సింహం వలె , రాజభవనం యొక్క స్తంభం నుండి అవతరించారు. ఎందుకంటే ఈ హిరణ్యకశిపు బ్రహ్మ నుండి వరము పొందాడు, అతను ఏ వ్యక్తి లేదా ఏ జంతువు ద్వారా చంపబడడు. అందువల్ల భగవంతుడు మానవుడుగా గాని జంతువుగా గానీ అవతరించలేదు. ఇది భగవంతుడి యొక్క మేధస్సు మరియు మన మేధస్సు మధ్య తేడా. మనము మనబుద్ధితో భగవంతున్ని మోసం చేయాలని ఆలోచిస్తాము. కానీ భగవంతుడు మనకంటే తెలివైనవాడు. ఈ హిరణ్యకశిపు బ్రహ్మను పరోక్ష నిర్వచనముతో మోసగించాలని అనుకున్నాడు. మొదటిగా అతను అమరత్వాన్ని కావాలని కోరుకున్నాడు. బ్రహ్మా చెప్పారు, " ఇది సాధ్యం కాదు ఎందుకంటే నేను కూడా అమరుడిని కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరికీ అమరత్వం లేదు. అది సాధ్యం కాదు". హిరణ్యకశిపు, రాక్షసుడు ... రాక్షసులు చాలా తెలివైనవారు. అతను పరోక్ష లేదా వేరే విధానములో, నేను అమరుడిని అవుతానని అభిప్రాయపడ్డాడు. అతను బ్రహ్మను ప్రార్థించాడు, "నాకు వరము ఇవ్వండి, నేను ఏ మనుష్యుడు లేదా ఏ జంతువుచేతనైనా చంపబడను.” బ్రహ్మా, "అవును, అది సరే" అని అన్నాడు. నేను ఆకాశంలో, నీటిలో లేదా భూమిపై చంపబడను. బ్రహ్మా, "సరే" అని అన్నాడు. ఏ మానవ నిర్మిత ఆయుధాలచే నేను చంపబడను. "సరే." ఈ విధంగా, అతడు అనేక విధాలుగ తన తెలివితేటలను ఉపయోగించాడు, కేవలం అమరత్వాన్ని పొందడానికి. కానీ భగవంతుడు చాలా మోసపూరితమైనవాడు, అతను బ్రహ్మ చేత ఇచ్చిన అన్ని వరములను పాటిస్తూ అతనిని చంపాడు. అతను చెప్పాడు "నేను పగటిపూట లేదా రాత్రి సమయంలో చంపబడ కూడదు." బ్రహ్మా "సరే" అన్నాడు కాబట్టి అతను కేవలం పగటిపూట మరియు రాత్రి మధ్యలో, కేవలం సాయంత్రం చంపబడ్డాడు. మీరు పగలు లేదా రాత్రి అని చెప్పలేరు. అతను "నేను ఆకాశంలో, నీటిలో, భూమిపై చంపబడ కూడదు" అని వరము తీసుకున్నాడు. అందువలన అతను తన ఒడిలో ఉంచుకొని చంపారు. అతను "నేను ఏ మనిషి చేసిన లేదా ఏ దేవుడు చేసిన ఆయుధాలచే చంపకూడదు." అది ఇవ్వబడింది, అయితే సరే. అందువలన అతడు గోర్లతో చంపబడ్డాడు. ఈ విధంగా, అన్ని వరములు చెక్కుచెదరకుండా ఉంచబడ్డాయి, అయినప్పటికీ అతడు చంపబడ్డాడు. అదేవిధంగా, మనము ప్రణాళిక చేయవచ్చు, మనము శాస్త్రీయ జ్ఞానం లో చాలా అభివృద్ధి పొందవచ్చు, కానీ ప్రకృతి యొక్క హత్య ప్రక్రియ అక్కడ ఉంటుంది. ఎవరూ తప్పించుకోలేరు. మన బుద్ధి వల్ల మనము తప్పించుకోలేము. భౌతిక జీవితము యొక్క నాలుగు సూత్రాలు జన్మించడము, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి అని అర్థం. మనము అనేక మందులు, అనేక ఆయుధాలు, అనేక మార్గాలు, అనేక పద్ధతులను తయారుచేయవచ్చు. అయితే మీరు ఈ నాలుగు సూత్రాల భౌతిక జీవితముని తప్పించుకోలేరు, మీరు ఎంత గొప్ప వారు అయినప్పటికీ. అది హిరణ్యకశిపునితో నిరూపించబడింది. హిరణ్యకశిపుడు భౌతికవాదులు అందరిలో కల్లా గొప్పవాడు, అతను ఎప్పటికీ నివసించడాన్ని,ఆనందాన్ని కోరుకున్నాడు, కానీ అతను కూడా జీవించలేకపోయాడు. అంతా నాశనమైపోతుంది.