TE/Prabhupada 0413 - జపము చేయడం ద్వారా పరిపూర్ణత యొక్క ఉన్నత దశకు రావచ్చు



Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974


భగవంతుని దివ్య నామాలను జపించడంలో మూడు దశలు ఉన్నాయి. నామ జపం అపరాధం తో మొదలవుతుంది. అలాంటి మూల దోషాలు నామాపరాధాలు పది ఉన్నాయి. మనము అనేకసార్లు వివరించాము. మనం అపరాధము తో జపం చేస్తే అది ఒక దశ. మనము అపరాధ రహితముగా జపము చేస్తే అది ఒక దశ మరియు మనము శుద్ధముగా జపము చేస్తే అది ఒక దశ. అపరాధ రహితమైనది శుద్ధ దశ కాదు. మీరు అపరాధ రహితంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా అపరాధ రహితము కాలేదు. కానీ ఎప్పుడైతే మీరు శుద్ధ నామము జపిస్తారో అప్పుడు విజయం పొందుతారు. నామాపరాధ దశ, నామాభాస దశ, మరియు శుద్ధ నామము. అందువలన మన లక్ష్యము ఇది. ఇది చర్చించాము. మీరు చైతన్య చరితామృతము లో హరిదాసు ఠాకూర, బ్రాహ్మణుల మధ్య చర్చను తెలుసుకుంటే జపము చేయడం ద్వారా పరిపూర్ణత యొక్క ఉన్నత దశకు రావచ్చు. ప్రారంభంలో అపరాధాలు ఉండవచ్చు కానీ అపరాధాలను నివారించడానికి మనం ప్రయత్నిస్తే అది నామాభాస దశ. నామాభాస అనేది వాస్తవానికి పవిత్రమైన నామము కాదు కాని దాదాపు పవిత్రమైనది. నామాభాస మరియు శుధ్ధ నామము. ఎప్పుడైతే మనము శుద్ధ నామాన్ని జపిస్తామో ఆ నామము భగవంతుని దివ్య నామము. అప్పుడు అతను ఉన్న తన స్థితి కృష్ణుడి మీద ప్రేమ ఉన్నా స్థితి ఇది పరిపూర్ణ దశ. మరియు నామాభాస దశ పవిత్రమైన దశ కాదు. అపరాధ దశకు శుద్ధ దశకు మధ్య ఉన్న స్థితి ముక్త స్థితి. మీరు ముక్తులవుతారు భౌతిక బంధనం నుండి విముక్తి పొందుతారు. మరియు మనం అపరాధాలతో జపం చేస్తున్నట్లైతే భౌతిక ప్రపంచం లోనే ఉండిపోతాము. భక్తి వినోద ఠాకూరా చెప్పారు nāmākāra bahira haya nāma nāhi haya. అది యాంత్రిక మైనది, "హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ... కానీ అది హరేకృష్ణ కాదు nāmākāra bahira haya nāma nāhi haya. nāmākāra bahira haya nāma nāhi haya.

అందువలన మనం శుధ్ధనామం జపించాలి కానీ మనం నిరాశ చెందకూడదు అందువలన శుధ్ధస్థితి కాకపోయినను మనము స్థిరంగా నామ జపం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పవిత్రమైన దశలో లేము. అందువలన బలవంతంగా అయినా సరే పాఠశాలలోని అబ్బాయిలాగా చిన్నప్పుడు పాఠశాలలో మనందరికీ ఈ శిక్షణ ఉంది మా గురువు నన్ను అడగవచ్చు, "మీరు పది పేజీలు, చేతివ్రాతను వ్రాయండి." ఈ పది పేజీలను సాధన చేయడం అంటే, నా చేతివ్రాత బాగు చేయబడుతుంది. మనము పదహారు మాలలను అనుసరించక పోయినట్లైతే, హరేకృష్ణ జపమనే ప్రశ్న ఎక్కడ ఉంది? కృత్రిమంగా ఉండకూడదు. నేను చెప్పేదానికి అర్థం ఏమిటంటే నటించ వద్దు. వాస్తవమైనదిగా చేయండి. అది కావలసినది. మీరు ఆధ్యాత్మిక జీవితాన్నుండి నిజంగా లాభం పొందాలని కోరుకుంటే, బూటకపు పని చేయకూడదు. మీకు ప్రదర్శన కూజా తెలుసా? వైద్య దుకణంలో, ఒక పెద్ద సీసా. ఇది నీటితో నిండి ఉంటుంది. ఎరుపు లేదా నీలం రంగు లేదా ఏదో రంగు ఉంటుంది . కానీ వాస్తవమైన ఔషధంకు అవసరం లేదు... వాస్తవ ఔషధంకు ఒక పెద్ద సీసా అవసరం లేదు. ఒక చిన్న... ఒకసారి నామాన్ని పవిత్రంగా చేయగలిగితే, ఒకసారి కృష్ణ -నామాన్ని, అతను అన్ని భౌతిక బంధనముల నుండి స్వేచ్చ పొందవచ్చు. ఒకసారి మాత్రమే. Eka kṛṣṇa nāme yata pāpa haya, pāpī haya tata pāpa kari baro nāhi.

శౌచం, శౌచం అంటే అర్థం లోపలి పరిశుభ్రత మరియు బాహ్య పరిశుభ్రత, శౌచం . లోపల, మనము (శుధ్ధంగా) పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఆలోచిస్తూ, ఏ కాలుష్యం లేకుండా ఉండాలి. మనం ఎవ్వరినీ శత్రువుగా అనుకోకూడదు. ప్రతిఒక్కరూ స్నేహితుడే. నేను ... నేను పవిత్రం కాలేదు; అందువలన నేను వేరెవరినో శత్రువుగా అనుకుంటున్నాను చాల లక్షణాలు ఉన్నాయి. శౌచం: ప్రతిఒక్కరూ, లోపల వెలుపల శుభ్రంగా ఉండాలి. సత్య శౌచ దయ. ఆ దయ గురించి నేను ఇప్పటికే వివరించాను. దయ అంటే పతితులైన వారిపై దయచూపాలి, పతితుడైన వాడు, బాధలో ఉన్నవాడు. వాస్తవనికి, ప్రస్తుత సమయంలో జనాభా మొత్తం , వారంతా పతితులై పోయారు కృష్ణుడు చెప్తడు,

yadā yadā hi dharmasya
glānir bhavati bhārata
abhyutthānam adharmasya
tadātmānaṁ sṛjāmy aham
(BG 4.7)
paritrāṇāya sādhūnāṁ
vināśāya ca duṣkṛtām
dharma-saṁsthāpanārthāya
sambhavāmi yuge yuge
(BG 4.8)

అందువలన ప్రస్తుత సమయంలో ఈ కలి, కలియుగంలో ఉన్నవారందరూ సర్వసాధారణంగా రాక్షసులే, అందరూ రాక్షసులు. అందువలన కృష్ణుడు... వాస్తవానికి కొన్నిసార్లు రాక్షసులను చంపడానికి కృష్ణుడు ఇక్కడకు వస్తాడు. అదే కల్కి అవతారము. దీనిని జయ దేవ గోస్వామి వర్ణించారు. అది ఏమిటి? కేశవ ధృత కల్కి శరీర జగదీశ హరే. Kalau, dhūmaketum iva kim api karālam, mleccha-nivaha-nidhane kalayasi karavālam. మ్లేఛ్ఛ, మ్లేఛ్ఛులు, ఈ పదము, యవనులు, ఇవి ఈ పదాలన్నీ వైదిక భాషలో ఉన్నాయి మ్లేఛ్ఛ , యవన. యవన అంటే మాంసం తినేవాడు. దీనికి అర్థం ఇది కాదు కేవలం యూరోపియన్లు మరియు అమెరికన్లు మాత్రమే యవనులు, భారతీయులు యవనులు కాదని, లేదు. మాంసం తింటున్నవారు ఎవరైనా సరే వారు యవనులు. యవన అంటే మాంసం తినేవాడు. మరియు మ్లేఛ్ఛ అంటే అపవిత్రత అని అర్థం. ఎవరైతే వేద సూత్రాలను అనుసరించడో అతను మ్లేఛ్ఛ అని పిలువబడతాడు. మహమ్మదీయులు చెప్పినట్లుగా కఫీర్ వలె ముస్లిం ధర్మమును అనుసరించని వారిని కఫీర్ అని పిలుస్తారు ఇది మతపరమైన అభిప్రాయము. క్రైస్తవులు హెథెన్స్ అని అంటారు. ఎవరైతే క్రైస్తవ మతాన్ని పాటించనివారు ఉంటారో వారు హెథెన్స్ అని పిలువబడ్డారు. అది కాదా? అదేవిధంగా, వైదిక సూత్రాన్ని పాటించని ఎవరినైన అతన్ని మ్లేఛ్ఛ అని పిలుస్తారు. ఒక సమయం వస్తుంది అప్పుడు జీవన వైదిక సూత్రాలను ఎవరూ అనుసరించరు. అందువలన, మ్లేఛ్ఛ. మ్లేఛ్ఛ -నివహ, ఎప్పుడు ప్రజలు మ్లేఛ్ఛులు అవుతారు, వేద సూత్రలను ఎవరూ అనుసరించరు, మ్లేఛ్ఛ -నివహ -నిధనే, ఆ సమయంలో ఇంక ప్రచారము ఉండదు, కేవలం చంపడం మాత్రమే.