TE/Prabhupada 1063 - అన్ని కార్యకలాపాల యొక్క కర్మ మరియు ప్రతి కర్మల నుండి ఉపసమనాన్ని ఇవ్వండి

Revision as of 10:03, 18 May 2015 by Visnu Murti (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1063 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

ఏ విధముగా ఐతే ప్రస్తుత జీవిత కాలంలో కుడా మనము మన కర్మలు అనుభవిస్తాము , కర్మ ఫలానాను. ఒక వేల నేను ఒక వ్యాపారవేత్తను మరియు నా తెలివితేటలతో చాలా కష్టపడి పనిచేసాను. మరియు చాలా గొప్ప పరిమాణంలో బ్యాంకు బాలన్స్ను జమ చేసుకున్నాను. ఇప్పుడు నేనే అనుభవించువాడను. అదే విధముగా ఒకవేళ నా వ్యాపారాన్ని నేను గొప్ప ధనముతో ప్రారంభించాను, కాని విజయవంతం కావడంలో విఫలమయ్యాను. నా ధనాన్ని అంతా నేనే పోగొట్టుకున్నాను, కావున నేను దుఖితుడను. అదే విధముగా మన జీవితం యొక్క అన్ని విభాగాలలో మనం అనుభవించెదము, మన కర్మ యొక్క ఫలితాలను మనం అనుభవించెదము. దీన్నే కర్మ అని అంటారు. కావున ఈ విషయాలు ఈశ్వర, జీవ, ప్రకృతి, లేక దేవాదిదేవుడు, లేక జీవుడు, భౌతిక ప్రకృతి, శాస్వత కాలము, మరియు మన యొక్క విభిన్న కార్యకలాపములు, ఈ విషయాలన్నీ భగవద్గీతలో వివరింపబడిఉన్నాయి. ఇప్పుడు ఈ ఐదింటిలో భగవంతుడు, జీవులు, మరియు భౌతిక ప్రకృతి, కాలము, ఈ నాలుగు విషయములు శాస్వతం ఇప్పుడు అవతరణ, ప్రకృతి యొక్క అవతరణ తాత్కాలికం కావచ్చు, కాని అది అసత్యం కాదు. కొంతమంది తత్వవేత్తలు, భౌతిక ప్రాకృతి యొక్క అవతరణ మిధ్యా అని అంటారు. కాని భగవద్గీత తత్వం ప్రకారం లేక వైష్ణవుల తత్వం ప్రకారం, వారు ఈ సృష్టి యొక్క అవతరణను మిధ్యా అని అంగీకరించరు. ఆ యొక్క అవతరణను వారు వాస్తవమని అంగీకరిస్తరు, కాని అది తాత్కాలికం. ఇది ఏ విధముగా అంటే, ఆకాశంలో మేఘము ఏర్పడటంవంటిది, మరియు వర్షాకాలము ప్రారంభవుతుంది. మరియు వర్షాకాలం తరువాత ఈ భూభాగం అంతా కూడా పచ్చటి పచ్చికబైళ్ళు ఏర్పడును, అది మనం చూడవచ్చు. మరియు ఎప్పుడైతే ఈ వర్షాకాలం పూర్తి అవుతుందో, తరువాత మేఘములు కూడా అంతరించిపోతాయి. సాధారణంగా, క్రమంగా, ఈ పచికబైళ్ళు అన్ని కూడా ఎండిపోయి భూమి అంతా బీడుగా తయారవుతుంది. అదే విధముగా, ఈ భౌతిక సృష్టి ఒకానొక కాలంలో సంభవిస్తుంది. భగవద్గీత సంపుటాల నుండి మనం దాన్ని అర్ధం చేసుకోగలము, మనం దాన్ని తెలుసుకొగలము. భూత్వా భూత్వా ప్రళీయతె (భ్హగవద్గీత 8.19). ఈ యొక్క సృష్టి అవతరణ ఒక నిర్దిష్ట కాలము నందు వైభవొపేతమగును, మరియు మరలా అంతరించును. అది ప్రకృతి యొక్క పనితీరు. కానీ అది శాశ్వతముగా పనిచేస్తుంది కావున ప్రకృతి నిత్యము. ఇది తప్పు కాదు, భగవంతుడు దాన్ని అంగీకరించారు, మమ ప్రకృతి, "నా ప్రకృతి". అప్రమేయం ఇతస్ తు విద్ధి మే ప్రకృతిం పరం (భగవద్గీత 7.5). భిన్నా ప్రకృతి, భిన్నా ప్రకృతి, అపరా ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి దేవాదిదేవుని యొక్క భిన్న శక్తి, మరియు జీవులు, అవి కూడా దేవాదిదేవుని యొక్క శక్తియే, కాని భిన్నములు కాదు . అవి శాశ్వతముగా సంబంధము కలిగియునట్టివి. కావున భగవంతుడు, జీవులు, ప్రకృతి, భౌతిక ప్రకృతి మరియు కాలము అవి అన్నీ శాశ్వతము (నిత్యము). కాని ఆ ఇంకొక వస్తువు, కర్మ, అది శాశ్వతము కాదు. కర్మ లేదా పని యొక్క పరిణామాలు చాలా పురాతనం కావచ్చు. అనంతకాలముగా మనం మన కర్మల యొక్క ఫలితాలను ఆనందిస్తున్నాము లేదా దుఖిస్తున్నాము, అయినప్పటికీ, మనం మన యొక్క కర్మ లేదా పని యొక్క ఫలితాలను మార్చుకొనవచ్చు. అది మన పరిపూర్ణ జ్ఞానముపై ఆధార పడిఉంది. అసంషయముగా మనం ఎన్నో వివిధ రకముల కార్యకలాపాలలో నిమగ్నమయున్నాం, కాని ఎటువంటి కార్యకలాపాలు ఆపాదించుకొవాలో తెలియలేకున్నాం. అది అన్నీ కార్యకలాపాల యొక్క కర్మ ప్రతికర్మల నుండి ఉపసమనాన్ని ఇస్తుంది. ఈ విషయం భగవద్గీతలో కూడా వివరింపబడి ఉంది. ఇప్పుడు, ఈస్వరుని యొక్క స్థానము పరమ చైతన్యము (దివ్యము). ఈస్వరుని లేదా దేవాదిదేవుని యొక్క స్థానము పరమ చైతన్యము. మరియు ఆత్మలు లేదా జీవులు భగవంతుని యొక్క అంశీభూతులుగా, అవి కూడా చేతనమే. జీవాత్మ కూడా చేతనమే. జీవుని ప్రకృతిగా, శక్తి, వివరింపబడినది, భౌతిక సృష్టి కూడా ప్రకృతిగానే వవరిమ్పబడినది. కాని ఆ రెండింటిలో, ఒక ప్రకృతి, జీవులు, వారు చేతనులు. వేరొక ప్రకృతి చేతనము కాదు, అది వ్యత్యాసము. కావున ఈ జీవా ప్రకృతి పరా ప్రకృతిగా పిలవబడుతుంది, ఎందుకంటే జీవులు భగవంతునితో పోలిన చైతన్యం కలిగిఉన్నారు. భగవంతుడు పరమ చైతన్యము. కాని జీవుని లేదా ఆత్మను కూడా పరమ చైతన్యముగా ఏ ఒక్కరు పరిగణించరాదు. లేదు. ఏ పరిపూర్ణ స్థితియందైనా కానీ జీవుడు పరమ చైతన్యము కలిగి ఉండలేదు. ఇది ఒక తప్పు త్రోవ పట్టించే తత్వము. ఇది ఒక తప్పు త్రోవ పట్టించే తత్వము. కానీ ఆయన చేతనము, అంతే, కానీ ఆయన పరమ చేతనము కాదు.