TE/Prabhupada 1076 - మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును
మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును
Invalid source, must be from amazon or causelessmery.com
660219-20 - Lecture BG Introduction - New York
మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును వివిధ రకములైన భావములు వున్నాయి భౌతిక భావము ,బావములలో ఒకటి . ఇంతకు ముందే వివరించాము భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలో ఒకదాని ప్రదర్శనము విష్ణు పురాణలో భగవంతుని సమస్త శక్తులు సంగ్రహముగ చెప్పబడినవి
- విష్ణు శక్తిహ్ పరా ప్రోక్తా
- క్షేత్ర జ్ఞాఖ్య తథ పర్
- అవిద్య కర్మ సంఙ్ఞన్య
- తృతీయ శక్తిర్ ఇష్యతే
- (CC Madhya 6.154)
అన్ని శక్తులు , పరాస్య శక్తిర్ వివిధైవా శ్రూయతే (CC Madhya 13.65, purport) భగవంతునికి వివిధ రకములైన శక్తులు అసంఖ్యాక శక్తులు వున్నాయి. వాటిని మనము ఊహించలేము కాని విజ్ఞానవంతులైన మహర్షులు , ముక్త జీవులు ఈ శక్తులను అధ్యయనం చేసినారు వారు సమస్త శక్తులను మూడు భాగములుగా మూడు శీర్షికలుగా సంగ్రహించారు మొదటిది....అన్ని శక్తులు విష్ణు శక్తి అన్ని శక్తులు భగవంతుని యొక్క వివిధ శక్తులు ఈ శక్తీ పరా ఆధ్యాత్మికమైనది మరియు క్షేత్ర జ్ఞాఖ్య తథ పరా మరిహై జీవులు క్షేత్రజ్ఞ జీవులు ఉన్నత శక్తికి చెందినవారు ఇది భగవద్గితలో ధ్రువీకరించారు . మనము ఇంతకు ముందే వివరించాము ఇతర శక్తులు , భౌతిక శక్తీ తృతీయ కర్మ సంఙ్ఞన్య (CC Madhya 6.154) మిగతా శక్తీ తమో గుణములో వున్నది కావున అది భౌతిక శక్తీ . భౌతిక శక్తీ కూడా భగవద్గితలో వున్నది (గూఢముగా వున్నది ) మరణ సమయమున మనము భౌతిక శక్తిలో ఉండవచ్చును లేదా భౌతిక ప్రపంచములో లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును ఇదే నియమము .భాగవద్గిత చెపుతుంది
- యం యం వాపి స్మరన్ భావం
- త్యజతి అంతే కలెవరం
- తమ్ తమ్ ఈవైతి కౌంతేయ
- సదా తద్ భావ భావితః
మనము ఈ విధముగా ఆలోచించుటకు అలవాటు చేసుకున్నాము భౌతిక శక్తీ లేదా ఆధ్యాత్మిక శక్తీ ఈ రొండిటిలో ఒకటి ఈ ఆలోచనను ఎలా మార్చవలెను భౌతిక శక్తీ ఆలోచనను ఆధ్యాత్మిక ఆలోచనలోకి ఎలా మార్చవలెను ఆధ్యాత్మిక ఆలోచనకొరకు మనకు వేదిక్ గ్రంధములు వున్నాయి భౌతిక శక్తీ ఆలోచన కొరకు ఎనో గ్రంధాలు వున్నాయి వార్తాపత్రికలు, నవలలు, పత్రికలూ , కల్పనలు ఇంకా ఎన్నో వున్నాయి ఎన్నో సాహిత్యాలు వున్నాయి . మన ఆలోచన అంత ఈ సాహిత్యాలలో నిమగ్నమై వున్నది అదే విధముగా మన ఆలోచనను ఆధ్యాత్మిక వాతావరణములోనికి మార్చుకోగలితే అప్పుడు మనము మన చదివే సామర్ధ్యాన్ని వేదిక్ గ్రంధములలోనికి మార్చుకొనవలెను విజ్ఞానవంతులైన మహర్షులు ఇందువలన ఎన్నో వేదిక్ గ్రంధములను పురాణాలను రచించారు పురాణాలు కథలు కాదు . అవి చరిత్ర యొక్క సమాచారము ఛైతన్య చరితామృతలో ఒక్క శ్లోకము ఈ విధముగా వున్నది అనాది బహిర్ముఖ జీవ కృష్ణ బులి గెల అట్టేవా కృష్ణ వేద పురాణ కైలా(CC Madhya 20.117). విస్మరణ స్వభావము కలిగిన జీవులు , బద్ధ జీవులు దేవాదిదేవునితో తమ సంబంధాన్ని విస్మరించినారు భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో నిమగ్నమై యున్నారు వారి ఆలోచనలను ఆధ్యాత్మిక సామర్ద్యమునకు మరలుచుటకు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు , ఎన్నో వేదిక్ గ్రంధములను అందించారు వేదిక్ గ్రంధములను అనగా , తొలుత నాలుగు వేదాలుగా విభజించారు తరువాత వాటిని పురాణాలతో వివరించారు సామాన్య ప్రజల (స్త్రీలు శుద్రులు , వైశ్యులు ) కొరకు మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతం నందే భగవద్గిత అందిచబడినది పిదప వేదిక్ సాహిత్యమును మొత్తాన్ని వేదాంత సూత్రముగా సంగ్రహించారు వేదాంత సూత్రము భవిష్యత్ కు మార్గదర్శకత్వం తానే శ్రీమద్ భాగవతమునకు సహజ వ్యాఖ్యానము రచించారు