TE/Prabhupada 1076 - మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును

Revision as of 21:12, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

మరణ సమయమున మనము ఇక్కడ ఉండవచ్చును లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును వివిధ రకములైన భావములు వున్నాయి భౌతిక భావము, భావములలో ఒకటి. ఇంతకు ముందే వివరించాము భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలో ఒకదాని ప్రదర్శనము విష్ణు పురాణంలో భగవంతుని సమస్త శక్తులు సంగ్రహముగ చెప్పబడినవి

విష్ణు శక్తిః పరా ప్రోక్తా
క్షేత్ర జ్ఞాఖ్య తథ పర్
అవిద్య కర్మ సంఙ్ఞన్య
తృతీయ శక్తిర్ ఇష్యతే
( CC Madhya 6.154)

అన్ని శక్తులు, పరాస్య శక్తిర్ వివిధైవా శ్రూయతే ( CC Madhya 13.65) భాష్యము భగవంతునికి వివిధ రకములైన శక్తులు అసంఖ్యాక శక్తులు వున్నాయి. వాటిని మనము ఊహించలేము కానీ విజ్ఞానవంతులైన మహర్షులు, ముక్త జీవులు ఈ శక్తులను అధ్యయనం చేసినారు వారు సమస్త శక్తులను మూడు భాగములుగా మూడు శీర్షికలుగా సంగ్రహించారు మొదటిది....అన్ని శక్తులు విష్ణు శక్తి అన్ని శక్తులు భగవంతుని యొక్క వివిధ శక్తులు ఈ శక్తి పరా ఆధ్యాత్మికమైనది మరియు క్షేత్ర జ్ఞాఖ్య తథ పరా మరియు జీవులు క్షేత్రజ్ఞ జీవులు ఉన్నత శక్తికి చెందినవారు ఇది భగవద్గీతలో ధ్రువీకరించారు. మనము ఇంతకు ముందే వివరించాము ఇతర శక్తులు, భౌతిక శక్తి తృతీయ కర్మ సంఙ్ఞన్య ( CC Madhya 6.154) మిగతా శక్తి తమో గుణములో వున్నది కావున అది భౌతిక శక్తి. భౌతిక శక్తి కూడా భగవద్గీతలో వున్నది (గూఢముగా వున్నది ) మరణ సమయమున మనము భౌతిక శక్తిలో ఉండవచ్చును లేదా భౌతిక ప్రపంచములో లేదా ఆధ్యాత్మిక ప్రపంచమునకు వెళ్లవచ్చును ఇదే నియమము. భగవద్గీత చెపుతుంది

యం యం వాపి స్మరన్
భావం త్యజతంతే కలేవరం
తమ్ తమేవైతి కౌంతేయ
సదా తద్ భావ భావితః
( BG 8.6)

మనము ఈ విధముగా ఆలోచించుటకు అలవాటు చేసుకున్నాము భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి ఈ రొండిటిలో ఒకటి ఈ ఆలోచనను ఎలా మార్చవలెను భౌతిక శక్తి ఆలోచనను ఆధ్యాత్మిక ఆలోచనలోకి ఎలా మార్చవలెను ఆధ్యాత్మిక ఆలోచన కొరకు మనకు వైదిక గ్రంథములు వున్నాయి భౌతిక శక్తి ఆలోచన కొరకు ఎన్నో గ్రంథములు వున్నాయి వార్తాపత్రికలు, నవలలు, పత్రికలూ, కల్పనలు ఇంకా ఎన్నో వున్నాయి ఎన్నో సాహిత్యాలు వున్నాయి. మన ఆలోచన అంతా ఈ సాహిత్యాలలో నిమగ్నమై వున్నది అదే విధముగా మన ఆలోచనను ఆధ్యాత్మిక వాతావరణములోనికి మార్చుకోగలితే అప్పుడు మనము మన చదివే సామర్థ్యాన్ని వైదిక గ్రంథములలోనికి మార్చుకొనవలెను విజ్ఞానవంతులైన మహర్షులు ఇందువలన ఎన్నో వైదిక గ్రంథములను పురాణాలను రచించారు పురాణాలు కథలు కాదు. అవి చరిత్ర యొక్క సమాచారము ఛైతన్య చరితామృతంలో ఒక శ్లోకము ఈ విధముగా వున్నది అనాది బహిర్ముఖ జీవ కృష్ణ బులి గెల అట్టేవా కృష్ణ వేద పురాణ కైలా ( CC Madhya.117) విస్మరణ స్వభావము కలిగిన జీవులు, బద్ధ జీవులు దేవాదిదేవునితో తమ సంబంధాన్ని విస్మరించినారు భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో నిమగ్నమై యున్నారు వారి ఆలోచనలను ఆధ్యాత్మిక సామర్థ్యమునకు మరలుచుటకు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు, ఎన్నో వైదిక గ్రంథములను అందించారు వైదిక గ్రంథములను అనగా, తొలుత నాలుగు వేదాలుగా విభజించారు తరువాత వాటిని పురాణాలతో వివరించారు సామాన్య ప్రజల (స్త్రీలు శూద్రులు, వైశ్యులు ) కొరకు మహాభారతాన్ని ఇచ్చారు మహాభారతం నందే భగవద్గీత అందించబడినది పిదప వైదిక సాహిత్యమును మొత్తాన్ని వేదాంత సూత్రముగా సంగ్రహించారు వేదాంత సూత్రము భవిష్యత్ కు మార్గదర్శకత్వం తానే శ్రీమద్ భాగవతమునకు సహజ వ్యాఖ్యానము రచించారు